యాప్నగరం

Harish Rao: సీఎం కేసీఆర్ ఆ పని ఏనాడు చేయలేదు: మంత్రి హరీశ్

Edupayala Vanadurga Mata: ఏడుపాయల వనదుర్గామాతకు తెలంగాణ ప్రభుత్వం తరపున మంత్రి హరీశ్ రావు పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయ అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. రాష్ట్రంలో దేవాలయాలను అభివృద్ధి చేస్తున్నా.. ఏనాడు మతాన్ని రాజకీయాలకు వాడుకోలేదని చెప్పారు.

Authored byసందీప్ పూల | Samayam Telugu 18 Feb 2023, 1:43 pm

ప్రధానాంశాలు:

  • ఏడుపాయలలో మహాశివరాత్రి వేడుకలు
  • పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి హరీశ్
  • దేవాలయాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని వ్యాఖ్య
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu harish rao
హరీశ్ రావు
Edupayala Temple: హిందుధర్మ పరిరక్షణకోసం తమ ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి హరీశ్ రావు అన్నారు. తెలంగాణలో దేవాలయాల అభివృద్దికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారన్నారు. యాదాద్రి ఆలయాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దామని.., తాజాగా కొండగట్టు ఆలయానికి కూడా ప్రత్యేక నిధులు ప్రకటించినట్లు తెలిపారు. అయినా సీఎం కేసీఆర్ ఏనాడు రాజకీయాలకు మతాలను వాడుకోలేదని చెప్పారు. మెదక్ జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం కాగా.. ప్రభుత్వం తరపున వనదుర్గాదేవికి మంత్రి హరీశ్ రావు పట్టువస్త్రాలు సమర్పించారు.
ఈసందర్భంగా మీడియాతో మాట్లాడిన హరీశ్ రావు.. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలోని ఆలయాలు ఉండాలన్న మంచి భావనతో సీఎం పనిచేస్తున్నారన్నారు. అయినా రాజకీయంగా పేరు రావాలని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నడూ కోరుకోలేదన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం దేవాలయల అభివృద్దికి బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తుందని అన్నారు. కేసిఆర్ పాలనలో అన్ని రంగాల్లో తెలంగాణ ముందుకు సాగుతుందని అన్నారు. వేద పండితులు, బ్రాహ్మణుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. దేవాలయ ఉద్యోగుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నామని మంత్రి హరీశ్ చెప్పుకొచ్చారు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఏడుపాయల ఆలయానికి ప్రతియేటా నిధులు కేటాయిస్తున్నామని వివరించారు. ఈ సారి కూడా దేవాలయ అభివృద్ధికి రూ. 2 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్ రెడ్డి, మధన్ రెడ్డి, కలెక్టర్ రాజర్షి షా, అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్, రమేష్, ఎస్పీ రోహిణి ప్రియదర్శిని తదితరలు పాల్గొన్నారు.

  • Read More Telangana News And Telugu News
రచయిత గురించి
సందీప్ పూల
సందీప్ పూల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.