యాప్నగరం

హరీశ్ రావు అపాయిట్‌మెంట్ ఇచ్చేవాడు కాదు.. ఇప్పుడు ఫోన్లు.. జగ్గా రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో స్థానిక నేతలు రాజులా బతికేవారని.. మీ ఓటుతో కేసీఆర్‌కి మీ పవర్ చూపించే అవకాశం వచ్చిందని జగ్గా రెడ్డి అన్నారు. నిర్మలా జగ్గా రెడ్డిని గెలిపించాలని ఆయన కోరారు.

Samayam Telugu 28 Nov 2021, 9:26 pm
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
harish
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు సమీపిస్తుండడంతో నేతలు మాటలకు పదునుపెడుతున్నారు. ప్రత్యర్థులపై విమర్శలతో విరుచుకుపడుతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం నుంచి తన భార్య నిర్మలా జగ్గా రెడ్డిని బరిలోకి దించిన జగ్గా రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. స్థానిక నేతలకు కనీసం అపాయిట్మెంట్ కూడా ఇవ్వని హరీశ్ రావు కాంగ్రెస్ అభ్యర్థిని బరిలోకి దింపగానే అందరికీ ఫోన్లు చేస్తున్నాడని ఆయన ఎద్దేవా చేశారు.

నారాయణఖేడ్‌లో స్థానిక నేతలతో జగ్గా రెడ్డి సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మీ పవర్ చూపే సమయం ఇదేనని ఆయన అన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థలకు నిధులు మంజూరయ్యేవని.. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే కేసీఆర్ దిగి వస్తారని.. స్థానిక సంస్థలకు నిధులు కూడా మంజూరవుతాయని జగ్గా రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీకి అధికారం కొత్తేమీ కాదని.. మన ఓట్లతో పాటు టీఆర్ఎస్ నేతలు ఎవరైనా కలిసి వస్తే ఓట్లు వేయించాలని అన్నారు.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.