యాప్నగరం

Farmer Death: కొనుగోలు కేంద్రం వద్ద కుప్పకూలిన మరో రైతు.. విషాదం

ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద మరో విషాదం జరిగిపోయింది. ధాన్యం విక్రయించేందుకు వచ్చిన మరో రైతు గుండె ఆగిపోయింది. హఠాత్తుగా కుప్పకూలిపోయి ప్రాణాలు విడిచాడు.

Samayam Telugu 19 Nov 2021, 3:12 pm
ధాన్యం కొనుగోలు కోసం రోజుల తరబడి ఎదురుచూసి వడ్ల కుప్పపైనే కుప్పకూలిపోయిన కామారెడ్డి జిల్లాకు చెందిన రైతు బీరయ్య మరణం మరువక ముందే మరో విషాద ఘటన చోటుచేసుకుంది. ధాన్యం విక్రయించేందుకు ఐకేపీ సెంటర్‌కి వచ్చిన మరో రైతు వడ్ల కుప్పను ఎగబోస్తూ ప్రాణాలు కోల్పోయిన ఘటన వెలుగుచూసింది. సిద్ధిపేట జిల్లా దుబ్బాకలో ఈ ఘటన జరిగింది. దుబ్బాక మండలం ధర్మాజీపేట గ్రామానికి చెందిన రైతు జనగామ రాములు తాను పండించిన వరి ధాన్యాన్ని విక్రయించేందుకు కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చాడు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
death


నిన్న రాత్రి కొనుగోలు కేంద్రం వద్ద ధాన్యం ఎగబోస్తుండతా హఠాత్తుగా కుప్పకూలిపోయాడు. కంగారుపడిన కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే ఆయన్ను 108 అంబులెన్సులో దుబ్బాక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు రాములు అప్పటికే మృతి చెందినట్టు చెప్పడంతో కుటుంబ సభ్యులు, బంధువుల కన్నీటిపర్యంతమయ్యారు. మృతుడు రాములుకి భార్య సుజాత, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇంటి పెద్ద మరణంతో కుటుంబానికి దిక్కులేకుండా పోయింది. ప్రభుత్వం స్పందించి రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.