యాప్నగరం

Harish Rao: మెదక్‌‌ను మెడికల్ హబ్‌గా తీర్చిదిద్దుతాం: హరీశ్ రావు

Harish Rao: కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనం అని చెప్పినా.. తెలంగాణ ప్రభుత్వం ధాన్యాన్ని చివరి గింజ వరకు కొనుగోలు చేసిందని హరీశ్ రావు వ్యాఖ్యానించారు. దేశంలోనే ఎక్కువ పంటలు పండుతున్న ఏకైక రాష్ట్రం.. తెలంగాణ అని అన్నారు. త్వరలోనే మెదక్‌లో మెడికల్ కాలేజీ, 400 పడకల హాస్పిటల్‌ను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.

Authored byశివకుమార్ బాసాని | Samayam Telugu 22 Sep 2022, 9:30 pm
Harish Rao: తెలంగాణ ప్రభుత్వం వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని.. మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యానించారు. త్వరలోనే మెదక్‌లో మెడికల్ కాలేజీ, 400 పడకల హాస్పిటల్‌ను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. మెదక్‌ను మెడికల్ హబ్‌గా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. ప్రభుత్వం తరఫున వైద్యం అందించే విషయంలో.. ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) సీరియస్‌గా ఉంటారని చెప్పారు. దేశంలోని ఇతర రాష్ట్రాలకంటే ఎక్కువ పథకాలు.. తెలంగాణ రాష్ట్రంలోనే అమలవుతున్నాయని హరీశ్ రావు వివరించారు.
Samayam Telugu Harish Rao speaking in the review
సమీక్షలో మాట్లాడుతున్న హరీశ్ రావు


మెదక్‌కు ర్యాక్ పాయింట్ రావడంతో ఎరువుల కొరత లేదని మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. గతంలో లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తే.. ఇప్పుడు 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండిస్తున్నామని వివరించారు. మెదక్ (Medak) ధాన్యగార జిల్లాగా మారిందన్నారు. సీఎం కేసీఆర్‌కు ఉన్న సంకల్పంతో రైతుల కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెడుతున్నారని చెప్పారు. తెలంగాణలో 1.35 కోట్ల ఎకరాల్లో పంటలు పండుతున్నాయని వివరించారు. దేశంలోనే ఎక్కువ పంటలు పండుతున్న ఏకైక రాష్ట్రం.. తెలంగాణ అని అన్నారు.

కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనం అని చెప్పినా.. తెలంగాణ (Telangana) ప్రభుత్వం ధాన్యాన్ని చివరి గింజ వరకు కొనుగోలు చేసిందని హరీశ్ రావు వ్యాఖ్యానించారు. వాస్తవాలను ప్రజలముందు ఉంచాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిధులపై ఉందన్నారు. విత్తన సాగు పెంచేలా రైతులను ప్రోత్సహించాలని.. పామాయిల్ తోటల పెంపకాన్ని ప్రోత్సహిస్తే రైతుకు డబుల్ ఆదాయం వస్తందని మంత్రి సూచించారు. ఆసరా (Asara) పెన్షన్లకు అర్హులైన వారు మిస్సయితే గుర్తించాలని.. సీఎం కేసీఆర్‌ను ఒప్పించి ఇప్పించే బాధ్యత నాది అని భరోసా ఇచ్చారు.
రచయిత గురించి
శివకుమార్ బాసాని
శివకుమార్ బాసాని సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు, రాజకీయ వార్తలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.