యాప్నగరం

నిశ్చితార్థం రోజే యువకుడి అనుమానాస్పద మృతి.. అసలేం జరిగింది?

నిశ్చితార్థానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్న యువకుడు.. ఆ శుభకార్యం జరగాల్సిన రోజే శవంలా కనిపించాడు. అనుమానాస్పద స్థితిలో ఓ యువకుడు మృతి చెందడం సంగారెడ్డి జిల్లాలో సంచలనంగా మారింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు.

Authored byRaj Kumar | Samayam Telugu 26 Apr 2022, 1:16 pm
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
నిశ్చితార్థానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్న యువకుడు.. ఆ శుభకార్యం జరగాల్సిన రోజే శవంలా కనిపించాడు. అనుమానాస్పద స్థితిలో ఓ యువకుడు మృతి చెందడం సంగారెడ్డి జిల్లాలో సంచలనంగా మారింది. ఇది హత్య.. ఆత్మహత్య.. తెలియక మిస్టరీగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. మెదక్‌ జిల్లా టేక్మాల్‌కు చెందిన గుంజి బాలరాజ్‌ (25), అతడి అన్న శంకర్‌ ఏడాదిగా అదే మండలంలోని పాల్వంచ సోలార్‌ ప్లాంట్‌లో పనిచేస్తున్నారు. బాలరాజ్‌ డ్రైవర్‌గా పని చేసేవాడు. ఆదివారం అర్ధరాత్రి వరకు విధి నిర్వహణలోనే ఉన్న బాలరాజ్‌ సోమవారం ఉదయానికల్లా సంగారెడ్డి జిల్లా అందోలు మండలం దానంపల్లి శివారులో ఓ విద్యుత్‌ స్తంభానికి ఉరికి వేలాడుతూ విగతజీవిలా కనిపించాడు.

ఈ క్రమంలోనే భయభ్రాంతులకు గురైన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో జోగిపేట పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. బాధిత కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు అక్కడికి చేరుకొని బోరున విలపించారు. శుభకార్యం జరగాల్సిన ఇంట్లో విషాదం నెలకొందని కన్నీరు పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు.

ఆత్మహత్య కాదు.. హత్యే: కుటుంబ సభ్యులు
నిశ్చితార్థానికి అన్ని ఏర్పాట్లు తానే దగ్గరుండి చేసుకున్న బాలరాజ్ ఎందుకు ఆత్మహత్య చేసుకుంటాడని.. ఎవరో కావాలనే చంపి వేలాడదీశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఎప్పుడూ తిరిగే ప్రాంతంలో కాకుండా.. మరో చోటుకు వెళ్లి ఎత్తులో ఉన్న స్తంభానికి ఎలా ఉరేసుకుంటాడని.. ఇదంతా ఎవరో కావాలనే చేశారని అనుమానం వ్యక్తం చేశారు.
రచయిత గురించి
Raj Kumar

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.