యాప్నగరం

మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాజీనామా.! కాంగ్రెస్ డిమాండ్, పరిగిలో ఉద్రిక్తత

మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పోలీసులు, కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం జరగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Samayam Telugu 14 Aug 2021, 7:36 pm
వికారాబాద్ జిల్లా పరిగి మార్కెట్ యార్డు చైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. కార్యక్రమానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరవుతున్నారని తెలిసి పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు సభా ప్రాంగణం వైపు దూసుకొచ్చారు. దళిత బంధుతో పాటు బీసీ బంధు కూడా ప్రకటించాలని.. రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని కోరుతూ నినాదాలు చేశారు. సభ ప్రాంగణం వద్దకు భారీగా కాంగ్రెస్ కార్యకర్తలు చేరుకోవడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. మంత్రికి వినతి పత్రం ఇచ్చేందుకు అనుమతించాలని కోరినా పోలీసులు నిరాకరించడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చెలరేగింది. ఆగ్రహం చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు మంత్రి సబితా ఇంద్రారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పెద్దఎత్తున నినాదాలు చేస్తూ అక్కడే నిరసన తెలపడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఆందోళనకారులను పోలీసులు స్టేషన్‌కి తరలించారు. అయితే కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన సబితా ఇంద్రారెడ్డి టీఆర్‌ఎస్‌లోకి చేరి మంత్రి పదవి దక్కించుకున్న విషయం తెలిసిందే.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం


Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.