యాప్నగరం

అత్తింటి వేధింపులు.. అల్లుడు ఆత్మహత్య

భర్త ఆర్థిక పరిస్థితి బాగాలేదని భార్య తరచూ గొడవలకు దిగేది. తమ్ముళ్లతో కలిసి భర్తను కొట్టించింది. అంతేకాకుండా పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో భర్త తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.

Samayam Telugu 31 Mar 2021, 12:38 pm
అత్తింటి వేధింపులు భరించలేక ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా దోమ మండలంలోని బొంపల్లి గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన వెంకటయ్య (37), జ్యోతి దంపతులు. వీరికి ఇద్దరు సంతానం. అయితే వెంకటయ్య ఆర్థికపరిస్థితి బాగాలేదని భార్య జ్యోతి గొడవపడేది. ఇదే విషయంపై దంపతులిద్దరికీ ఈ మధ్య గొడవ జరిగింది. ఆ సమయంలో జ్యోతి తన తమ్ముళ్లతో కలిసి వెంకటయ్యను కొట్టించింది. అనంతరం పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్లిపోయింది.
Samayam Telugu అల్లుడు ఆత్మహత్య


అయితే భార్య తనను వదిలి వెళ్లిపోవడం, బావ మరుదులు కొట్టడంతో తీవ్ర మనస్థాపానికి గురైన వెంకటయ్య ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన పొలం దగ్గర ఉన్న చింత చెట్టుకు ఉరేసుకొని చనిపోయాడు. ఆర్థిక ఇబ్బందులతో పాటు బావమరుదులు కొట్టడం మరియు భార్య వెళ్లిపోవడంతోనే తన కొడుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడని వెంకటయ్య తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.