యాప్నగరం

భారీ వర్షం.. ఇల్లు కూలి ఒకరు మృతి

ఈ దుర్ఘటనలో గుజరాత్‌కు చెందిన వలస కూలి షబ్బీర్ మృతి చెందాడు. షబ్బీర్‌కు పెళ్లై ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. అయితే ప్రమాదం జరిగిన రోజు రాత్రి ఇంట్లో షబ్బీర్ ఒక్కడే నిద్రపోయాడు.

Samayam Telugu 15 Jul 2021, 1:49 pm
భారీ వర్షానికి ఇల్లు కూలి ఒకరు మృతి చెందారు. ఈ దుర్ఘటన వికారాబాద్ మండలం రాళ్ల చిట్టంపల్లిలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బండల ఇల్లు కూలిపోయింది. ఈ ప్రమాదంలో గుజరాత్ రాష్ట్రం నుండి వలస కూలీగా బతుకు దెరువు కోసం గ్రామానికి వచ్చిన షబ్బీర్ మృతిచెందాడు. షబ్బీర్
Samayam Telugu ఇల్లు కూలి ఒకరు మృతి

రాళ్ల చిట్టెంపల్లి గ్రామానికి చెందిన సమ్రీన్ను పెళ్లి చేసుకొని దినసరి కూలీగా జీవనం కొనసాగించేవాడు.
వీరికి ఇద్దరు మగపిల్లలు ఒకరు ఆడపిల్ల ఉన్నారు.

సమ్రీన్ పుట్టింట్లో బుధవారం విందు కార్యక్రమం ఉండడంతో పిల్లలతో పాటు కలిసి వెళ్లింది.
షబ్బీర్ ఒక్కడు మాత్రమే బుధవారం రాత్రి బండల ఇంట్లో నిద్రించాడు. ఎడతెరిపి లేకుండా కురిసిన వానకు బండల ఇంటి గోడలు నాని నిద్రిస్తున్న షబ్బీర్ పై కూలడంతో అక్కడికక్కడే చనిపోయాడు. షబ్బీర్ ఇంటి పక్కన ఉన్న మహమ్మద్ చూసి మృతుని భార్య సమ్రీన్ కు సమాచారం ఇచ్చాడు. అనంతరం స్థానికులు గ్రామ సర్పంచ్‌కు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.