యాప్నగరం

తిండి లేక తల్లడిల్లిన తల్లి... బస్టాండ్‌లో వదిలేసిన కసాయి కొడుకులు

రెండు రోజులుగా చలికి వణుకుతూ ఆ తల్లి బస్టాండ్‌లోనే పడి ఉంది. సరైన తిండి లేక అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. దీంతో స్పందించిన మున్సిపల్ ఛైర్మన్ తల్లిని సురక్షిత ప్రాంతానికి తరలిస్తామన్నారు.

Samayam Telugu 21 Jun 2021, 8:17 am
నవమాసాలు మోసి కనిపెంచిన తల్లి పట్ల కుమారులు కర్కశంగా ప్రవర్తించారు. పేగు తెెంచుకొని పుట్టిన బిడ్డలే కన్నతల్లిని రోడ్డుపై వదిలేశారు. దీంతో పాపం ఆ తల్లి తిండి లేక.. స్పృహ తప్పిపడిపోయింది. రెండు రోజుల నుంచి ఏం తినక అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఈ ఘటన వికారాబాద్‌ జిల్లాలో చోటుచేసుకుంది. కోస్గి మండలం కడంపల్లి గ్రామానికి చెందిన 80 ఏళ్ల మహిళను ఆమె కుమారులు రెండు రోజులక్రితం కొడంగల్‌ బస్టాండ్‌లో వదిలేసి వెళ్లిపోయారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం


దీంతో అందరూ ఉండి కూడా ఆమె అనాథలా చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. బస్టాండ్‌లోని వ్యాపారులు, పరిసర వాసులు ఆమెకు రెండు రోజులు తిండి పెట్టారు. అయితే ఆదివారం ఉదయం ఆరోగ్యం క్షీణించడంతో బస్టాండ్‌లోకి తరలించారు. ఆ వృద్ధురాలికి ముగ్గురు కొడుకులు, ఒక కూతురు ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె దయనీయ పరిస్థితిని గమనించిన కొడంగల్‌ మున్సిపల్‌ చైర్మన్‌ జగదీశ్వర్‌రెడ్డి స్పందించారు. సోమవారం ఉదయం ఆమెను సురక్షిత ప్రాంతానికి తరలిస్తామని ఆయన తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.