యాప్నగరం

దిగొచ్చిన ఎమ్మెల్సీ.. పోలీసులకు పట్నం క్షమాపణలు.!

ఎమ్మెల్సీ బూతుపురాణం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపడంతో దిద్దుబాటు చర్యల్లో పడ్డారు. పోలీసులపై వ్యాఖ్యలకు ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు.

Samayam Telugu 28 Apr 2022, 7:11 pm
మాజీ మంత్రి, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ఎట్టకేలకు వెనక్కు తగ్గారు. తాండూరు సీఐని బూతులు తిట్టిన ఆడియో బయటకు లీక్ కావడం పెనుదుమారం రేపింది. ఎమ్మెల్యే వర్గీయులతో నెలకొన్న విభేదాల నేపథ్యంలో సీఐని టార్గెట్ చేస్తూ ఆయన బూతులతో విరుచుకుపడ్డారు. నీ అంతు చూస్తానంటూ రెచ్చిపోయారు. ఈ వ్యవహారం చినికిచినికి గాలివానగా మారడంతో ఎమ్మెల్సీ దిగొచ్చినట్లు తెలుస్తోంది. పొరపాటున నోరుజారానని.. పోలీసుల మనసులు నొచ్చుకున్నందుకు విచారిస్తున్నాననంటూ ప్రకటన విడుదల చేశారు.
Samayam Telugu patnam


పోలీసుల మనసు నొప్పించిన సంఘటన తనకూ బాధ కలిగించిందని ఎమ్మెల్సీ పట్నం పేర్కొన్నారు. పోలీసు సోదరులంతా తన కుటుంబ సభ్యులతో సమానమని.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి, అభివృద్ధి, శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల కృషి భినందనీయమంటూ ప్రశంసలు కురిపించారు. ఆవేశంలో పొరపాటున నోరుజారానని ఆయన చెప్పుకొచ్చారు. అందుకు కొంతమంది మిత్రులు, పోలీసులు బాధపడితే అందుకు తీవ్రంగా విచారం వ్యక్తం చేస్తున్నానని మహేందర్ రెడ్డి తెలిపారు. పోలీసులంటే తనకు ఎనలేని గౌరవమని పేర్కొన్నారు.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.