యాప్నగరం

రైలు కింద పడి ప్రేమజంట ఆత్మహత్య..

Vikarabad: వికారాబాద్ జిల్లాలో దారుణ సంఘటన జరిగింది. ఓ ప్రేమ జంట రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

Authored byRaj Kumar | Samayam Telugu 23 Jun 2022, 3:07 pm
వికారాబాద్ జిల్లాలో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ ప్రేమజంట రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. వారిద్దరూ ఇంటర్ చదివే విద్యార్థులేనని పోలీసులు భావిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం


వివరాల్లోకి వెళ్తే.. నవాబ్ పేట్ మండలం కడ్చర్లకు చెందిన ఇంటర్మీడియట్ చదువుతున్న అబ్బాయి ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఈ క్రమంలోనే వారి ప్రేమను పెద్దలకు చెప్పడంతో వారు అంగీకరించలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ ప్రేమ జంట గేట్ వనంపల్లి దగ్గర రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆ అమ్మాయి ఎవరనే దానిపై విచారణ జరుపుతున్నారు. ఆమె కూడా ఇంటర్ చదువుతోందని భావిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
రచయిత గురించి
Raj Kumar

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.