యాప్నగరం

పక్కింటి బాలికపై కొడుకు నీచం.. తల్లి సాయం.. దారుణం

బాలికపై కొడుకు నీచానికి పాల్పడ్డాడని తెలిసిన తల్లి నిలదీయలేదు. చిన్న పిల్ల అనే కనికరం కూడా లేకుండా బాధితురాలినే బెదిరించింది. నేరం రుజువవడంతో తల్లీకొడుకులు కటకటాలపాలయ్యారు.

Samayam Telugu 10 Mar 2021, 8:42 pm
పక్కింటి బాలికపై కొడుకు నీచానికి ఒడిగట్టాడు. అది తెలిసిన తల్లి కుమారుడిని మందలించాల్సింది పోయి అతనికే వత్తాసు పలికింది. ఎవరికీ చెప్పొద్దంటూ బాధితురాలిని బెదిరించి విషయం తొక్కిపెట్టాలని చూసింది. బాలిక నోరువిప్పడంతో తల్లీకొడుకులు జైలుపాలయ్యారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లాలో వెలుగుచూసింది. పరిగి పట్టణంలోని బీసీ కాలనీకి చెందిన సాయి(21) పెయింటర్‌గా పనిచేసేవాడు. ఇంటికి సమీపంలో ఉండే మైనర్ బాలికపై కన్నేసిన సాయి ఆమెను బలవంతంగా లాక్కెళ్లి దారుణానికి ఒడిగట్టాడు. ఆమెపై అత్యాచారం చేశాడు. విషయ తెలుసుకున్న అతని తల్లి ప్రభావతి కొడుక్కి బుద్ధి చెప్పాల్సింది పోయి అతనికే వత్తాసు పలికింది. గుట్టురట్టుకాకుండా బాలికను బెదిరింపులకు గురిచేసింది. విషయం ఎవరికైనా చెబితే దారుణ పరిస్థితులు ఉంటాయని భయపెట్టింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
rape case


అయితే బాలిక దారుణాన్ని తన కుటుంబ సభ్యులకు చెప్పుకుని బాధపడడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే బాధితురాలిని వెంటబెట్టుకుని పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. 2014లో జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించి కోర్టులో చార్జిషీటు దాఖలు చేయడంతో న్యాయస్థానం విచారణ జరిపింది. నేరం రుజువు కావడంతో నిందితుడికి జీవిత ఖైదు విధించడంతో పాటు అతనికి సహకరించిన తల్లికి మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ రంగారెడ్డి జిల్లా కోర్టు న్యాయమూర్తి తీర్పు వెలువరించారు.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.