యాప్నగరం

భర్త సినిమాకు తీసుకెళ్లలేదని.. పెళ్లయిన మూడు నెలలకే ఘోరం

వారిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లయి మూడు నెలల తిరగకముందే భార్య ఆత్మహత్య చేసుకుంది. భర్త సెకండ్‌ షో సినిమాకు తీసుకెళ్లలేదని మనస్తాపానికి గురైన ఆమె బలవన్మరణానికి పాల్పడింది.

Authored byRaj Kumar | Samayam Telugu 6 May 2022, 9:34 am
వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. జీవితాంతం కలసి ఉండాలని నిర్ణయించుకొని పెద్దలను ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నారు. కానీ పెళ్లయిన మూడు నెలలకే ఆ బంధం తెగిపోయింది. సంసారం అన్నాక చిన్న చిన్న గొడవలు సహజమే.. కానీ చిన్న గొడవకే భార్య ఆత్మహత్య చేసుకొని మరణించింది. భర్త సెకండ్‌ షో సినిమాకు తీసుకెళ్లలేదని మనస్తాపానికి గురైన భార్య గురువారం బలవన్మరణానికి పాల్పడిన ఘటన రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి పట్టణంలో జరిగింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం


వికారాబాద్‌ జిల్లా తాండూరు మండలం సంగెం గ్రామానికి చెందిన రాజు(22), స్వాతి(20) కొంతకాలం ప్రేమించుకున్నారు. ఈ క్రమంలోనే ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్నారు. అయితే ఆ తర్వాత ఇరువైపుల పెద్దల్ని ఒప్పించారు. 2 నెలల కింద శంకర్‌పల్లి పట్టణంలోని భవానీనగర్‌లో అద్దెకు గది తీసుకుని కాపురం పెట్టారు. రాజు హోటల్‌లో పనిచేసి కుటుంబాన్ని పోషిస్తున్నాడు.

ఈ క్రమంలోనే బుధవారం రాత్రి సెకండ్‌ షో సినిమాకి తీసుకెళ్లాలని స్వాతి భర్త రాజును అడిగింది.. అందుకు అతడు నిరాకరించాడు. గురువారం తీసుకెళ్తానని చెప్పాడు. ఈ విషయంలోనే చిన్న గొడవ జరగ్గా.. మనస్తాపానికి గురైన స్వాతి గురువారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ప్రాణం తీసుకుంది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు.
రచయిత గురించి
Raj Kumar

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.