యాప్నగరం

నా భార్య జాడ కనిపెట్టండి.. లేకుంటే ఇద్దరు పిల్లలతో ఆత్మహత్య చేసుకుంటానంటూ భర్త అదృశ్యం

కనిపించకుండాపోయిన తన భార్య జాడను కనిపెట్టాలంటూ ఓ భర్త ఇద్దరు పిల్లలతో అదృశ్యమయ్యాడు. ఈ ఘటన వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. దీంతో పోలీసులు వారిని వెతికే పనిలో పడ్డారు.

Authored byRaj Kumar | Samayam Telugu 25 Jun 2022, 1:32 pm
తన భార్య ఆచూకీ లభించలేదని పిల్లలతో పాటు భర్త అజ్ఞాతంలోకి వెళ్లాడు.. ఈ ఘటన వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో కలకలం రేపుతోంది. పట్టణానికి చెందిన దొరశెట్టి సత్యమూర్తి బీఎస్పీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన భార్య అన్నపూర్ణ గత 5 నెలల కింద ఇంటి నుంచి వెళ్లిపోయింది. బంధువులు, స్నేహితులు, చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో అప్పుడే స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆచూకీ తెలిపిన వారికి రూ.5 లక్షల బహుమానం కూడా ప్రకటించారు.
Samayam Telugu Vikarabad missing Case


అయినా, భార్య ఆచూకీ విషయంలో ఏ సమాచారం లేకపోవడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తూ.. పిల్లలతో పాటు భర్త ఓ వీడియో చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. 48 గంటల్లో తన భార్య ఆచూకీ కనిపెట్టాలని, లేకపోతే తన పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంటానని సెల్ఫీ వీడియోలో పోలీసులకు డెడ్‌లైన్ పెట్టి అజ్ఞాతంలోకి వెళ్లారు.

అంతేగాక, ఇందులో పెద్దవాళ్లు ఇన్వాల్వ్ అయి ఉన్నారని, భార్య అన్నపూర్ణ మిస్సింగ్ కేసు వెనకాల పెద్ద కుట్రే ఉందని సత్యమూర్తి పేర్కొన్నాడు. సామాజిక మాధ్యమాల్లో ఈ విషయాన్ని చూసిన స్నేహితులు, బంధువులు సత్యమూర్తి ఇంటికి వెళ్లి ఆరా తీయగా ఇంటికి తాళం వేసి ఉంది. దీంతో సత్యమూర్తి ఫోన్ నంబర్‌కు కాల్ చేయగా స్విచ్ఛాఫ్ ఉంది. ఈ విషయంపై బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు సత్యమూర్తి ఆచూకీ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు. జిల్లావ్యాప్తంగా ఈ విషయం హాట్‌ టాపిక్‌గా మారింది.
రచయిత గురించి
Raj Kumar

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.