యాప్నగరం

ఇంట్లో నిద్రిస్తున్న మహిళ.. తెల్లారేసరికి.. ఊహించని ఘోరం

సఫాయి కార్మికురాలిని చంపేశారు గుర్తుతెలియని దుండగులు. రాత్రి ఇంట్లో నిద్రించిన ఆమె శవమై కనిపించడంతో స్థానికంగా కలకలం రేగింది. వికారాబాద్ జిల్లాలో ఈ దారుణ ఘటన జరిగింది.

Samayam Telugu 20 Mar 2021, 3:36 pm
గ్రామాన్ని శుభ్రం చేసే పారిశుధ్య కార్మికురాలు దారుణ హత్యకు గురైంది. ఇంట్లో నిద్రిస్తున్న ఆమె తెల్లారేసరికి శవంగా మారడం తీవ్ర కలకలం రేపింది. దుండగులు నగదు, వెండి కోసమే హత్య చేసి ఉంటారన్నఅనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండంల చౌడాపూర్ గ్రామానికి చెందిన పారిశుధ్య కార్మికురాలు మైసమ్మ(58)ను గుర్తుతెలియని దుండగులు కిరాతకంగా హతమార్చారు. ఇంట్లో నిద్రిస్తుండగా ఆమెపై దాడి చేశారు. కొద్దిపాటి వెండి వస్తువులు, నగదు దోచుకెళ్లారు. తీవ్రగాయాలపాలైన మైసమ్మను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. దోపిడీ దొంగలే చంపేశారా? లేక మరేవైనా కారణాలు ఉన్నాయా అనే కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
sleep


Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.