యాప్నగరం

Warangal: పదో తరగతి ఫెయిల్.. అయితేనేం ఇప్పుడు ఆయనో ఆవిష్కర్త.. ఓ కంపెనీ ఓనర్..

Warangal: ఆవిష్కరణలకు చదువుతో పని లేదు. పెద్దపెద్ద చదువులు చదివితేనే ఆవిష్కరణలు సాధ్యమనే నమ్మకాన్ని పదో తరగతి ఫెయిల్ అయిన ఓ వ్యక్తి పటాపంచలు చేశాడు. కష్టం విలువ తెలిసి.. పరిష్కారం కోసం కావాల్సిన తపన ఉంటే చాలు.. ఆవిష్కరణలు సాధ్యమని నిరూపించాడు. పదో తరగతి కూడా పూర్తి చేయని ఆ వ్యక్తి ఓ మెకానిక్‌గా జీవితాన్ని ప్రారంభించి.. ఇప్పుడు ఓ ఆవిష్కర్తగా.. ఓ కంపెనీకి ఓనర్ అయ్యాడు. కూలీల కొరతతో ఇబ్బందులు పడుతున్న రైతుల కోసం కల్టివేటర్ యంత్రాలు తయారు చేసి.. అందరి చేత ఔరా అనిపించుకున్నాడు.

Authored byరామ్ ప్రసాద్ | Samayam Telugu 21 Nov 2022, 4:31 pm

ప్రధానాంశాలు:

  • ఆవిష్కర్తగా మారిన పదో తరగతి ఫెయిల్ అయిన వ్యక్తి
  • వ్యవసాయ యంత్రాలు ఆవిష్కరిస్తూ ఎందరికో ఆదర్శం
  • రాష్ట్రపతి చేత అవార్డు అందుకున్న మహిపాల్ చారి
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Warangal
Warangal: ఆయన తన పదో తరగతి కూడా పాస్ కాలేదు. అయితేనేం ఇప్పుడు ఆయన వ్యవసాయ యంత్రాల ఆవిష్కర్త అయ్యాడు. నూతన అవిష్కరణలకు చదువుతో పనిలేదు.. కష్టం తెలిసుండి పరిష్కారానికై తపనుంటే చాలని నిరూపించాడు. వరంగల్ గ్రామీణ జిల్లా సీతాపురం గ్రామానికి చెందిన మహిపాల్ చారిది పేద రైతు కుటుంబం. చదువుకోడానికి కుటుంబ ఇబ్బందులు అడ్డురావటంతో.. చదువును మధ్యలోనే ఆపేశాడు. జమ్మింకుంటలో మెకానిక్‌గా పనిచేయటం ప్రారంభించాడు. బైకులు, ఆటోలు, ట్రాక్టర్‌లు రిపేర్ చేయడం నేర్చుకున్నాడు. కానీ.. అతనికి చేస్తున్న పని సంతృప్తినివ్వలేదు. తిరిగి స్వగ్రామానికి చేరుకున్నాడు. రెండెకరాల పొలం ఉన్నా అందులో కలుపు చేసేందుకు పశువులు లేక.. కూలీల కొరతతో ఇబ్బంది పడటం చూశాడు. ఎక్కువ కూలీ ఇచ్చేందుకు ఆర్థిక స్థోమత లేక సతమతమయ్యాడు. దీంతో.. ఎడ్లు, ట్రాక్టర్లు, కూలీల మీద ఆధారపడకుండా ఉండేలా ఏదైనా యంత్రాన్ని తయారు చేయాలనుకున్నాడు. తనకున్న మెకానిక్ బుర్రతో పని మొదలు పెట్టాడు. 2011లో మినీ-కల్టివేటర్‌ను రూపొందించడం ప్రారంభించాడు.
యంత్రాన్ని రూపొందిస్తున్నప్పుడు.. మొదట ఆటో ఇంజిన్‌ను ఉపయోగించాడు. కానీ.. ఫలితం రాలేదు. నిరాశ చెందకుండా ప్రయత్నాన్ని కొనసాగించాడు. ఇంటర్నెట్ సహాయం తీసుకుని మినీ కల్టివేటర్‌లో కొద్దిపాటి మార్పులు చేశాడు. హ్యాండిల్, క్లచ్ బిగించి.. సక్సెస్ అయ్యాడు. పత్తి, మిరప లాంటి పంటల్లో సులభంగా పత్తి తీసే యంత్రాన్ని ఆవిష్కరించాడు. ఇక అప్పటి నుంచి కొల్లాపూర్ నుంచి ఇంజిన్లు, హైదరాబాద్ నుంచి మెటీరియల్ తీసుకొచ్చి కల్టివేటర్లను తయారు చేయటం ప్రారంభించాడు.

కట్ చేస్తే.. ఇప్పుడు వరుణ్ ఇంజినీరింగ్ వర్క్స్ అనే కంపెనీకి మహిపాల్ చారీ ఓనర్. ఈ కంపెనీలో 12 మంది కార్మికులు ఉన్నారు. ఈ కంపెనీ ఉత్పత్తులను 4,000 మంది సాగుదారులు విక్రయించారు. ఈ యంత్రాలు కొవిడ్‌కు ముందు భారతదేశంలోని ఇతర ప్రాంతాలకు కూడా ఎగుమతి అయ్యాయి. అయితే మహమ్మారి తర్వాత వాటి అమ్మకాలు ఇప్పుడు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే పరిమితమయ్యాయి.

మహిపాల్ చారి తయారు చేసిన ఉత్పత్తులలో 22 అంగుళాల కల్టివేటర్‌ను 4 హెచ్పీ ఇంజిన్‌తో అమర్చారు. ఇది 22 అంగుళాల కంటే ఎక్కువ ఎడంతో పండించే పంటల్లోనూ కలుపు తీసేందుకు ఉపయోగపడుతుంది. పండ్ల తోటలు, డ్రై ల్యాండ్ పొలాలలో తేలికగా దున్నడానికి.. చారీ 5 హెచ్పీ ఇంజిన్‌తోనూ ఒక వెర్షన్‌ యంత్రాన్ని కూడా తయారు చేశాడు. కేవలం కల్టివేటర్ యంత్రాలలాగానే కాదు.. ఒక ట్రాలీకి అనుసంధానిస్తే ఏకంగా ఒక టన్ను బరువు మోసే చిన్న సైజు ట్రాక్టర్‌గానూ.. ఉపయోగపడుతుంది. కాగా.. మహిపాల్ చారి ఆవిష్కరణలకు 2015లో రాష్ట్రపతి అవార్డు కూడా వచ్చింది. 2018లో నేషనల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అవార్డును కూడా ఆయన అందుకుని ఎందరికో ఆదర్శంగా మారాడు.


  • Read More Telangana News and Telugu News
రచయిత గురించి
రామ్ ప్రసాద్
రాంప్రసాద్ తుప్పారం సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, స్పోర్ట్స్, సినిమాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.