యాప్నగరం

పండగ పూట ప్రమాదం.. హైవేపై రెండు ఆర్టీసీ బస్సులు ఢీ.. డ్రైవర్ల పరిస్థితి విషమం

ఈ ఘటనలో రెండు ఆర్టీసీ బస్సు డ్రైవర్లకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారిద్దరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. దీంతో ఆయా కుటుంబాల్లో పండగవేళ తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

Samayam Telugu 13 Jan 2021, 10:36 am
పండగవేళ ప్రమాదం చోటు చేసుకుంది. భోగీ రోజు ఆనందంగా గడపాల్సిన వారంతా ప్రమాదానికి గురై ఆస్పత్రి పాలయ్యారు. ఈ ఘటన కరీంనగర్- వరంగల్ జాతీయ రహదారిపై జరిగింది. హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు ఆర్టీసీ బస్సులు బలంగా ఢీకొన్నాయి. ఈ ఘటన వరంగల్ జిల్లా ఎల్కతుర్తి మండలం వల్బాపూర్ వద్ద ఉన్న ఈ జాతీయ రహదారిపై చోటు చేసుకుంది.
Samayam Telugu ఢీకొన్న ఆర్టీసీ బస్సులు
warangal road accident


Read More: Covid Vaccine: కరోనా వ్యాక్సిన్ ధర ఎంతో తెలుసా...?

రెండు ఆర్టీసీ బస్సులు ఒకదానికొకటి ఢీ కొనడంతో అందులో ప్రయాణిస్తున్న దాదాపు 24మంది తీవ్ర గాయాలపాలయ్యారు. దీంతో వెంటనే 12 మందిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా.. ఇద్దరు డ్రైవర్ల పరిస్థితి విషమంగా ఉన్నట్టు డాక్టర్లు చెబుతున్నారు. దీంతో వారి కుటుంబాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. మరోవైపు ఘటనా స్థలం వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.