యాప్నగరం

Mahabubabad: రామాలయంలో మైక్ సెట్ చేస్తుండగా.. విద్యుదాఘాతంతో ముగ్గురు మృతి

మహబూబాబాద్ జిల్లాలో ఘోరం జరిగింది. రామాలయంలో మైక్ సెట్ చేస్తుండగా కరెంట్ షాక్ తగిలి ముగ్గురు దుర్మరణం చెందారు. దీనిపై పోలీసులకు సమాచారం అందడంతో ఘటనాస్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Authored byRaj Kumar | Samayam Telugu 21 Jun 2022, 1:59 pm
మహబూబాబాద్‌ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. దేవుడి గుడిలో మైక్ సెట్ చేస్తుండగా దురదృష్టవశాత్తు కరెంట్ షాక్ తగిలి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తు్న్నారు. వివరాల్లోకి వెళ్తే.. డోర్నకల్‌ మండలం అందనాలపాడులో మంగళవారం ఉదయం రామాలయానికి మైక్ సెట్ చేస్తుండగా విద్యుత్ షాక్‌తో ముగ్గురు దుర్మరణం చెందారు. మృతులను సుబ్బారావు, మస్తాన్‌రావు, వెంకయ్యలుగా గుర్తించారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం


ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. విషయం తెలిసి మృతుల కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకొని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మైకులు కడుతున్న పైపు ఇనుపది కావడం వలనే విద్యుత్ షాక్ జరిగిందని స్థానికులు తెలిపారు. దీనికి సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
రచయిత గురించి
Raj Kumar

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.