యాప్నగరం

ఆరో తరగతి అమ్మాయికి గుండెపోటు.. సీపీఆర్ చేసినా నిలవని నిండు ప్రాణం

ఇటీవల వయసుతో తేడా లేకుండా ఆకస్మిక గుండెపోటుకు గురై పలువురు మృత్యువాత పడుతున్నారు. ఈ నేపథ్యంలో 13 సంవత్సరాల వయసున్న ఆరో తరగతి చదువుతున్న బాలికకు కూడా హార్ట్ ఎటాక్‌ రావటం.. విషాదకరం. ఈ విషాదకర ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం అబ్బాయిపాలెం గ్రామపంచాయతీ పరిధిలోని బోడతండలో చోటుచేసుకుంది.

Authored byరామ్ ప్రసాద్ | Samayam Telugu 31 Mar 2023, 9:51 pm

ప్రధానాంశాలు:

  • మహబూబాబాద్ జిల్లా బోడతండలో విషాదం
  • ఆరో తరగతి అమ్మాయికి గుండెపోటు
  • సీపీఆర్‌ చేసినా నిలవని నిండు ప్రాణం

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu sravanthi
హార్ట్ ఎటాక్
ఆడుతూ పాడుతూ గడపాల్సిన పదమూడేళ్ల వయసుున్న గుండె ఇక నేను కొట్టుకొనని ఆగిపోయింది. ఎప్పుడూ చెంగు చెంగున ఎగురుతూ.. ఎంతో సందడిగా ఉండే ఆరో తరగతి చదువుతున్న అమ్మాయి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే ఆ తల్లిదండ్రులకు కడుపుకోత మిగిలింది. ఈ హృదయ విధారక ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం అబ్బాయిపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని బోడ తండాలో శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. బోడతాండకు చెందిన బోడ లక్‌పతి, వసంత దంపతులు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు సంతానం. రెండో సంతానం బోడ స్రవంతి (13) స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు పాఠశాలలో 6వ తరగతి చదువుతోంది.
శ్రీరామనవమి సందర్భంగా పాఠశాలకు సెలవు కావటంతో సాయంత్రం వరకు తాండలో తోటి పిల్లలతో ఆడుకొని.. రాత్రి నాయనమ్మ దగ్గర నిద్రించింది. శుక్రవారం తెల్లవారుజామున ఆయాస పడుతూనే నిద్రలేచింది. శ్వాస తీసుకోవటం ఇబ్బందిగా ఉండటంతో నాయనమ్మను లేపింది. అనంతరం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. తల్లిదండ్రులు నిర్మాణంలో ఉన్న కొత్త ఇంటి వద్ద నిద్రించగా... విషయం తెలిసుకుని అందుబాటులో ఉన్న బాబాయ్ వచ్చి సీపీఆర్ చేసి స్థానికంగా ఉన్న ఆర్‌ఎంపీ వద్దకు తీసుకెళ్లారు. కానీ అప్పటికే బాలిక మృతి చెందినట్లు వైద్యుడు తెలపడంతో గుండెలవిసేలా రోధించారు.

ఇంత చిన్న వయస్సులో గుండెపోటుతో మరణించడంతో కుటుంబం శోక సంద్రంలో మునిగింది. చిన్నారి మృతి విషయం తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామాల వారు తండోపతండాలుగా తరిలివచ్చి బాలిక మృతదేహానికి నివాళి అర్పించారు. చిన్నారిని చూసి ప్రతి ఒక్కరూ కన్నీటి పర్యంతమయ్యారు.

సెల్యూట్ పోలీస్.. కాల్ వచ్చిన 3 నిమిషాల్లోనే వెళ్లి మహిళను రక్షించిన కానిస్టేబుల్
  • Read More Telangana News And Telugu News
రచయిత గురించి
రామ్ ప్రసాద్
రాంప్రసాద్ తుప్పారం సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, స్పోర్ట్స్, సినిమాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.