యాప్నగరం

పత్తి తీసేందుకు కూలీలను తీసుకెళ్తున్న ఆటో.. వెనక నుంచి ఢీ కొట్టిన ట్రాక్టర్

జనగామ జిల్లాలో ఉదయం బస్సు దగ్ధమైన ఘటన మరువక ముందే మరో ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న ఆటోను వెనకనుంచి ట్రాక్టర్ ఢీకొట్టింది..

Samayam Telugu 18 Oct 2021, 6:41 pm

ప్రధానాంశాలు:

  • జనగామ జిల్లా పామునూరులో ఘోర రోడ్డు ప్రమాదం
  • ఒకరు మృతి.. మరికొందరికి గాయాలు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu నుజ్జునుజ్జయిన ఆటో
జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆటోను వెనక నుంచి బలంగా ఓ ట్రాక్టర్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఓ కూలీ మృతి చెందగా.. మరికొందరికి గాయాలయ్యాయి. జనగామ జిల్లాలోని స్టేషన్ ఘన్‌పూర్ మండలం పామునూరు శివారులో సోమవారం మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగింది.
స్టేషన్ ఘన్‌పూర్ నుంచి జఫర్‌గఢ్‌ మండలం కునూరుకు పత్తి తీసేందుకు 9 మంది మహిళా కూలీలు ఆటోలో బయల్దేరారు. ఈ క్రమంలోనే ఒక ట్రాక్టర్ అతి వేగంగా ఆటోను వెనక నుంచి ఢీ కొట్టింది. దీంతో ఆటో రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో మోడెం కల్పన (35) తీవ్రంగా గాయపడింది. వెంటనే ఆమెను స్టేషన్ ఘన్‌పూర్‌లోని ఓ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ సరైన వైద్యం అందకపోవడంతో ఆమె మృతి చెందింది. మరోవైపు గాయపడిన ఆటో డ్రైవర్, పలువురు కూలీలకు అక్కడే స్థానికులు ప్రథమ చికిత్స అందించారు. అనంతరం 108 అంబులెన్స్ ద్వారా ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.