Bandi Sanjay: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తలపెట్టిన ప్రజా సంగ్రామ యాత్ర జనగామ జిల్లాలో కొనసాగుతోంది. పాదయాత్రలో భాగంగా బండి సంజయ్.. వివిధ వర్గాల ప్రజలను కలుస్తూ.. వారి బాధలను తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలోనే.. అర్చకులతో సంజయ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బండి కీలక కామెంట్స్ చేశారు. భగవద్గీతను కించపరిస్తే అడ్డుకుంటామని వ్యాఖ్యానించారు. ఇమామ్ లకు ఇచ్చే గౌరవం అర్చకులకు ఇవ్వరా..? అని సంజయ్ ప్రశ్నించారు. అర్చకులు (Priests) అడ్డాకూలీ వద్ద అడుక్కునే దుస్థితికి వచ్చినా స్పందించరా..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ (BJP) అధికారంలోకొస్తే.. పేద బ్రాహ్మణులను ఆదుకుంటామని బండి సంజయ్ హామీ ఇచ్చారు. గౌడ సోదరుల సంక్షేమం కోసం బీజేపీ కృషి చేస్తుందని బండి సంజయ్ వివరించారు. గౌడన్నలను గోస పెడుతూ.. కేసీఆర్ (KCR) పబ్బం గడుపుతున్నారని ఆరోపించారు. వారి పొట్ట గొట్టే చర్యలకు పాల్పడుతున్నారని.. ఇకపై ఈ అరాచకం సాగబోదని వ్యాఖ్యానించారు. అనంతరం పాదయాత్రలో భాగంగా.. గొల్లకురమలతో సమావేశమయ్యారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నెల్లుట్లలో బీజేపీ జెండాను ఆవిష్కరించారు.
జనగామ టౌన్ బహిరంగ సభలో పాల్గొన్న బండి సంజయ్.. సభా ప్రాంగణంలో అమరవీరులు సామా జగన్ మోహన్ రెడ్డి, చంచారపు రవీందర్ రెడ్డి, నెల్లుట్ల నరసింహారావు, వెంకట్ ఫోటోలకు నివాళులర్పించారు.
జనగామ టౌన్ బహిరంగ సభలో పాల్గొన్న బండి సంజయ్.. సభా ప్రాంగణంలో అమరవీరులు సామా జగన్ మోహన్ రెడ్డి, చంచారపు రవీందర్ రెడ్డి, నెల్లుట్ల నరసింహారావు, వెంకట్ ఫోటోలకు నివాళులర్పించారు.