యాప్నగరం

TRS అంటే.. తెలంగాణ రజాకార్ల సమితి: బండి సంజయ్

Bandi Sanjay: టీఆర్ఎస్ పార్టీపై బండి సంజయ్ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. టీఆర్ఎస్ అంటే.. తెలంగాణ రాష్ట్ర సమితి కాదని.. తెలంగాణ రజాకార్ల సమితి అని వ్యాఖ్యానించారు. ఎంఐఎం, టీఆర్ఎస్.. నాణేనికి ఉండే బొమ్మా బొరుసు లాంటివని స్పష్టం చేశారు.

Authored byశివకుమార్ బాసాని | Samayam Telugu 16 Aug 2022, 5:07 pm

ప్రధానాంశాలు:

  • టీఆర్ఎస్ పార్టీపై బండి సంజయ్ సంచలన కామెంట్స్
  • టీఆర్ఎస్ అంటే తెలంగాణ రజాకార్ల సమితి అని వ్యాఖ్య
  • తెలంగాణలో నిజాం తరహా పాలన కొనసాగుతోందని విమర్శ
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Bandi Sanjay speaking at Praja Sangrama Yatra
ప్రజా సంగ్రామ యాత్రలో మాట్లాడుతున్న బండి సంజయ్
Bandi Sanjay: టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ సర్కారుపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్. రజాకార్ల వారసత్వ పార్టీ ఎంఐఎంకి కొమ్ముకాస్తోందని ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంఐఎం పార్టీకి అండగా ఉంటున్నారని ఆరోపించారు. ఎంఐఎం, టీఆర్ఎస్.. నాణేనికి ఉండే బొమ్మా బొరుసు లాంటివని వ్యాఖ్యానించారు. తెలంగాణలో నిజాం తరహా పాలన కొనసాగుతోందన్న బండి.. టీఆర్ఎస్ (TRS) అంటే ‘తెలంగాణ రజాకార్ల సమితి’ అని వ్యాఖ్యానించారు.
సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా ఎందుకు జరపడంలేదో కేసీఆర్ (CM KCR) సమాధానం చెప్పాలని.. బండి సంజయ్ డిమాండ్ చేశారు. తెలంగాణ వీరుల చరిత్రను సమాజానికి తెలియకుండా చేస్తున్నారని ఆరోపించారు. విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలన్న బీజేపీ నేతలపై లాఠీఛార్జ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నియంతృత్వ ధోరణిలో పాలిస్తున్న కేసీఆర్ ను.. ఇంటికే పరిమిత చేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని బండి సంజయ్ (Bandi Sanjay) వ్యాఖ్యానించారు.

బండి సంజయ్ 14వ రోజు ప్రజా సంగ్రామ యాత్ర.. విసునూరు నుంచి వడ్డెర కాలనీ, లక్ష్మీనారాయణపురం స్టేజ్, పాలకుర్తి, లక్ష్మీనారాయణపురం, తొర్రూరు, శాతపురం, ధర్మ తండా స్టేజ్ మీదుగా కడవెండి వరకు కొనసాగనుంది. పాలకుర్తిలో నిర్వహించిన 'ప్రజా సంగ్రామ యాత్ర' (Praja Sangrama Yatra) బహిరంగ సభకు ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. అయితే.. పాలకుర్తిలో బండి సభను ఫెయిల్ చేసేందుకు కుట్ర చేశారని బీజేపీ (BJP) ఆరోపించింది. టీఆర్ఎస్ ఆదేశాలతోనే పోలీసులు దగ్గరుండి షాపులన్నీ మూసివేయిస్తున్నారని కమలం నేతలు ఆరోపించారు. రెక్కాడితే గానీ డొక్కాడని చిరు వ్యాపారులను కూడా ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు.
రచయిత గురించి
శివకుమార్ బాసాని
శివకుమార్ బాసాని సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు, రాజకీయ వార్తలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.