యాప్నగరం

దెబ్బకు దెబ్బ తీస్తా సీఎం... జనగామలో కేసీఆర్‌కు బండి సంజయ్ వార్నింగ్

జనగామల బండి సంజయ్ పర్యటనతో మరోసారి పరిస్థితులు ఉద్రిక్తం మారాయి. భారీగా బీజేపీ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మరోసాారి కేసీఆర్‌కు వార్నింగ్ ఇచ్చారు బండి సంజయ్.

Samayam Telugu 13 Jan 2021, 2:42 pm
జనగామలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. బండి సంజయ్ పర్యటనతో అక్కడ మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. బిజెపి కార్యకర్త పవన్ శర్మపై నిన్న సీఐ లాఠీఛార్జి చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బిజెపి కార్యకర్తలపై పోలీసుల లాఠిచార్జ్ చేయడం పై బండి సంజయ్, బిజెపి కార్యకర్తలు, నేతలు మండిపడ్డారు. దీంతో జనగామలో భారీ ర్యాలీకి పిలుపునిచ్చారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు ముందస్తు జాగ్రత్తగా జనగాంలో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.
Samayam Telugu బండి సంజయ్


పోలీసుల లాఠీచార్జిలో గాయపడిన బీజేపీ కార్యకర్త పవన్ ను బండి సంజయ్ పరామర్శించారు. జనగామ మున్సిపల్ కమిషనర్ తక్షణమే సిఐను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. బిజెపి కార్యకర్తలపై పోలీసులు కావాలనే టార్గెట్ చేస్తున్నారని ఇదంతా కుట్ర పూరితంగా నే జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే లాఠీ ఛార్జిచేసిన పోలీసులపై కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. టీఆర్ఎస్ ఫ్లెక్సీలు ఉంచి, స్వామి వివేకానంద ఫ్లెక్సీలు తొలగించిన మున్సిపల్‌ కమిషనర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

తెలంగాణలో రాక్షస పాలన కొనసాగుతోందని మండిపడ్డారు బండి సంజయ్. సీఎం కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ నుంచి బయటకు వచ్చి బాధ్యులపై చర్యలు తీసుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తో యుద్ధానికి మేమెప్పుడూ సిద్ధమన్నారు. దెబ్బకు దెబ్బ తీస్తాం కాచుకో ముఖ్యమంత్రి కెసిఆర్ అంటూ సవాల్ చేశారు. ీ సందర్భంగా ర్యాలీలో బీజేపీ శ్రేణులు భారీగా పాల్గొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.