యాప్నగరం

'నా గొంతులో ప్రాణమున్నంత వరకు రామన్న చేయి వదలను..'

హన్మకొండలో శుక్రవారం నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఎమ్మెల్యే దాస్యం వినజయ్ భాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన గొంతులో ప్రాణమున్నంత వరకు.. మంత్రి కేటీఆర్ చేయి వదలని ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారం వల్ల.. తన నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తోందని తెలిపారు.

Authored byరామ్ ప్రసాద్ | Samayam Telugu 6 May 2023, 3:43 pm

ప్రధానాంశాలు:

  • హన్మకొండ సభలో దాస్యం వినయ్ భాస్కర్ కీలక వ్యాఖ్యలు
  • గొంతులో ప్రాణమున్నంత వరకు కేటీఆర్ చేయి వదలనంటూ వ్యాఖ్య
  • తన నియోజకవర్గం అభివృద్ధికి కేటీఆర్ సహకారమే కారణమని స్పష్టం

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu ktr dasyam
కేటీఆర్
తన గొంతులో ప్రాణమున్నంత వరకు మంత్రి కేటీఆర్ చేయి వదిలిపెట్టే ప్రసక్తి లేదని ప్రభుత్వ చీఫ్‌ విప్.. దాస్యం వినయ్‌ భాస్కర్‌ స్పష్టం చేశారు. హన్మకొండ జిల్లాలోని వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గంలోని కాజీపేట సెయింట్‌ గాబ్రియల్‌ హైస్కూల్ గ్రౌండ్‌లో శుక్రవారం నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సభలో.. ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశారు. 30 ఏళ్ల తన పొలిటికల్ కెరీర్‌లో ఎన్నో అవమానాలు పడ్డానని... మరెన్నో ఒడుదోడుకులు దాటానని వివరించారు. అలాంటి తనను పిలిచి రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన సీఎం కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటానని పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా పనిచేసిన ఈ పదేళ్ల జీవితం తనకు ఎంతో సంతృప్తిని ఇచ్చిందని వినయ్ భాస్కర్ తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో నియోజకవర్గ అభివృద్ధికి రూ.5 కోట్లు మంజూరు చేయించలేకపోయానని... కానీ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారం వల్ల తన నియోజవర్గ అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరవుతున్నాయని పేర్కొన్నారు.

బలగం లాంటి తన కార్యకర్తలు ఇచ్చిన ధైర్యంతో ఎక్కడా రాజీపడకుండా అభివృద్ధి పనులు చేయిస్తున్నట్టు దాస్యం వినయ్ భాస్కర్ తెలిపారు. సీఎం కేసీఆర్‌ సహకారంతో ఫాతిమానగర్‌లో చేపట్టిన ప్లైఓవర్‌ పనులు సాంకేతిక కారణాల వల్ల ఆలస్యం అవుతున్నాయని.. ఈ విషయాన్ని ప్రజలు గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి కేటీఆర్ చొరవతో.. జిల్లాకు నాలుగు అతిపెద్ద ఐటీ కంపెనీలు వచ్చాయన్నారు. ఈ కంపెనీల వల్ల సుమారు రెండు వేల మందికి ఉపాధి అవకాశాలు దొరకుతాయని వినయ్ భాస్కర్ తెలిపారు.

ఈ కార్యక్రమానికి.. మంత్రి కేటీఆర్‌తో పాటు.. మంత్రులు సత్యతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ కుమార్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎంపీలు మాలోతు కవిత, పసునూరి దయాకర్... ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

రైతులకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్.. మే 12 నుంచే ఎకరాకు రూ.10 వేలు..
  • Read More Telangana News And Telugu News
రచయిత గురించి
రామ్ ప్రసాద్
రాంప్రసాద్ తుప్పారం సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, స్పోర్ట్స్, సినిమాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.