యాప్నగరం

సీఎం కేసీఆర్‌కు అనారోగ్యం.. ఆ టూర్ వాయిదా!

తెలంగాణ సీఎం కేసీఆర్ భూపాలపల్లి జిల్లా పర్యటన వాయిదా పడింది. అనారోగ్యం కారణంగా గురువారం హాస్పిటల్‌కు వెళ్లిన సీఎం టెస్టులు చేయించుకున్న సంగతి తెలిసిందే.

Samayam Telugu 8 Jan 2021, 7:45 am
సీఎం కేసీఆర్ భూపాలపల్లి పర్యటన వాయిదా పడింది. నేడు ఏరియల్ సర్వే ద్వారా కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును పరిశీలించాల్సి ఉండగా.. అనారోగ్యం కారణంగా పర్యటనను వాయిదా వేసుకున్నారు. వాస్తవానికి ఈ నెల 5నే కేసీఆర్ భూపాలపల్లి జిల్లా పర్యటనకు వస్తారని ప్రచారం జరిగింది. కానీ అధికారికంగా జనవరి 8కి ఈ షెడ్యూల్ ఖరారు చేశారు. తాజాగా కేసీఆర్ టూర్ వాయిదా పడగా.. మళ్లీ ఎప్పుడు ఖరారు చేస్తారో తెలియాల్సి ఉంది.
Samayam Telugu kcr


ఊపిరితిత్తుల్లో మంట సమస్యతో రెండు రోజులుగా బాధపడుతున్న కేసీఆర్.. గురువారం యశోదా హాస్పిటల్‌లో మెడికల్ టెస్టులు చేయించుకున్న సంగతి తెలిసిందే. డాక్టర్ల సూచనల మేరకు ఆయన ఎంఆర్ఐ, సిటీ స్కాన్ తీయించుకున్నారు. కేసీఆర్‌కు ఊపిరితిత్తుల్లో స్వల్పంగా ఇన్ఫెక్షన్ ఉందని.. ఐదు రోజులకు మందులు రాసిచ్చినట్లు డాక్టర్లు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.