యాప్నగరం

ఆక్సిజన్ లెవల్స్ పెరిగిన.. తగ్గని టెన్షన్.. కోవిడ్ పేషంట్ ఆత్మహత్య

లింగమూర్తికి కరోనా బారిన పడ్డాడు. ఆక్సిజన్ లెవల్స్ తగ్గిపోవడంతో వెంటనే ఆస్పత్రిలో చేరాడు. అయితే ..రెండు రోజుల్లో ఆక్సిజన్ లెవల్స్ 66 నుంచి 93కు పెరిగింది. అయినా కూడా అతనిలో మానసిక ఆందోళన మాత్రం తగ్గలేదు.

Samayam Telugu 31 Jul 2021, 9:42 am
కరోనా బారిన పడి కోలుకొన్నా.. ఆందోళనతో ఆస్పత్రి భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చోటు చేసుకుంది. వరంగల్‌ రూరల్‌ జిల్లా సంగెం మండలకేంద్రానికి చెందిన రాయపురం లింగమూర్తి (34)కరోనా బారిన పడ్డాడు. ఈ నెల 24న కోవిడ్‌తో తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఎంజీఎం ఆస్పత్రిలో చేరాడు. అయితే అప్పటికీ ఆయన ఆక్సిజన్ లెవల్స్ 66 ఉన్నాయి. అయితే ఆరు రోజుల్లో 93కు పెరిగాయి.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం


అయినా రెండు రోజులుగా లింగ మూర్తి తీవ్ర మానసిక ఆందోళన చెందుతున్నాడు. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఆస్పత్రి భవనం రెండో అంతస్తునుంచి కిందకు దూకాడు.
తలకు తీవ్ర గాయాలు కావడంతో వైద్యులు అతనికి చికిత్స అందిస్తున్న క్రమంలోనే మృతిచెందాడు. మరో రెండు రోజులు చికిత్స పొందితే అతను కోలుకుని ఇంటికి వెళ్లేవాడని ఎంజీఎం అధికారులు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.