యాప్నగరం

ఢిల్లీ నిరసనల్లో రైతులే లేరు.. మేం రంగంలోకి దిగితే వేరేగా ఉంటది: అర్వింద్

Warangal Rural: వరంగల్ రూరల్‌‌ జిల్లాలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాష్ట్రంలో రైతుల పరిస్థితితోపాటు కొత్త వ్యవసాయ చట్టాల గురించి అర్వింద్ ఈ వ్యాఖ్యలు చేశారు.

Samayam Telugu 20 Dec 2020, 2:57 pm
కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తేల్చి చెప్పారు. అసలు ఢిల్లీ నిరసనలు చేస్తున్న వారిలో రైతులే లేరని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ కొత్త చట్టాలు రైతులకు మేలు కలిగిస్తాయని తెలిపారు. మద్దతు ధర విషయం గురించి మాట్లాడుతూ.. ఆ విషయంలో అవసరమైతే ప్రధాని భరోసా ఇస్తారని తెలిపారు. ప్రైవేటు పెట్టుబడులు అవసరమని గత యూపీఏ ప్రభుత్వమే చెప్పిందని అర్వింద్ గుర్తుచేశారు. కార్పొరేట్ సంస్థలు రైతులకు అండగా ఉంటాయని చెప్పారు. వరంగల్ రూరల్‌‌ జిల్లాలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాష్ట్రంలో రైతుల పరిస్థితితోపాటు కొత్త వ్యవసాయ చట్టాల గురించి అర్వింద్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Samayam Telugu మాట్లాడుతున్న అర్వింద్ (Dharmapuri Arvind/Twitter)
dharmapuri arvind


‘‘దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు దాటినా రైతుల పరిస్థితి మారలేదు. హమాలీ దగ్గర నుంచి ముఖ్యమంత్రి దాకా అందరూ అన్నదాతలను పీల్చి పిప్పి చేస్తున్నారు. కొత్త వ్యవసాయ చట్టాలతో కేసీఆర్‌‌కు ఉన్న సమస్య ఏంటో అర్థం కావడం లేదు. తెలంగాణలో నిర్వహించిన బంద్‌ రాష్ట్ర ప్రభుత్వమే పోలీసులతో చేయించింది. రైతులు ఇందులో పాల్గొనలేదు.’’

‘‘కొత్త వ్యవసాయ చట్టాల గురించి చర్చిద్దామని ఢిల్లీలో రైతులను పిలిస్తే ఎవ్వరూ రావడం లేదు. మాట్లాడబోమని, చట్టాలను వెనక్కి తీసుకోవాలని అంటున్నారు. వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదు. చర్చలకు మేం రెడీ. ఎంఎస్‌‌పీ విషయంలో హామీ కావాలంటే ప్రధాని మోదీ గారు లిఖితపూర్వకంగా హామీ ఇస్తారు. కలెక్టర్‌‌ను దాటి కోర్టుకు వెళ్లాలని రైతులు కోరుకుంటే దానికి ఓకే చెబుతాం. కానీ రైతు చట్టాలను వెనక్కి తీసుకోవాలంటే మాత్రం కుదరదు. మేం రోడ్డు మీదకు దిగితే పరిస్థితి వేరేలా ఉంటుంది. దుబ్బాక, జీహెచ్ఎంసీలో చూసింది ట్రైలర్‌‌లే’’ అని అర్వింద్ ఘాటుగా వ్యాఖ్యానించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.