యాప్నగరం

భర్తను చంపి అడవిలో పాతిపెట్టిన భార్య: కుళ్లిన స్థితిలో బయటికి తీసి అక్కడే పోస్ట్‌మార్టం

Bhupalpally: శుక్రవారం నేరేడుపల్లి సమీప మల్లంపల్లి అడవిలో తహశీల్దార్ అశోక్ కుమార్, ఎంజీఎం డాక్టర్‌ల ఆధ్వర్యంలో శవాన్ని వెలికి తీశారు. అనంతరం అక్కడే పంచనామా నిర్వహించారు.

Samayam Telugu 22 Jan 2021, 6:53 pm
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భర్తను అతి కిరాతకంగా హత్య చేసి అనంతరం అడవిలో పాతి పెట్టిన కేసును పోలీసులు ఛేదించారు. నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మృతదేహం పూర్తిగా కుళ్ళి పోవడంతో పోస్టుమార్టం నిమిత్తం అధికారులు అడవిలోకి వెళ్లి అక్కడే పంచనామా నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ శ్రీనివాసులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
Death Picture


భూపాలపల్లి మండలం నెరేడుపల్లి గ్రామానికి చెందిన శారద అనే మహిళ తన భర్త రమేష్‌ని హత్య చేసి అడవిలో పాతి పెట్టింది. ఈ ఘటనలో శుక్రవారం నేరేడుపల్లి సమీప మల్లంపల్లి అడవిలో తహశీల్దార్ అశోక్ కుమార్, ఎంజీఎం డాక్టర్‌ల ఆధ్వర్యంలో శవాన్ని వెలికి తీశారు. అనంతరం అక్కడే పంచనామా నిర్వహించారు. అనంతరం పోలీసులు నిందితుల్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లుగా అడిషనల్ ఎస్పీ వి.శ్రీనివాసులు మీడియా సమావేశంలో వెల్లడించారు.

నర్సక్కపల్లికి చెందిన రమేష్‌(40) తాపిమేస్త్రీ. 14 ఏళ్ల క్రితం భూపాలపల్లి మండలం నేరేడుపల్లికి చెందిన తుపాకుల శారదతో అతడికి వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. గతేడాది డిసెంబరు 1వ తేదీన బావమరిది కూతురు పుట్టిన రోజు ఉందని భార్యతో కలిసి నేరేడుపల్లికి వచ్చాడు. మరుసటి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఆ తర్వాత శారదతో మాత్రమే నర్సక్కపల్లికి వెళ్లింది. రమేష్‌ ఎక్కడని బంధువులు అడిగితే తనతో గొడవ పెట్టుకొని ఎటో వెళ్లిపోయాడని చెప్పింది. అయితే ఎన్ని రోజులైనా రమేష్ ఇంటికి రాకపోవడంతో ఈ నెల 18న అతడి సోదరి శ్రీలత భూపాలపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. భార్య శారదతో పాటు ఆమె బంధువులపై అనుమానం ఉందని ఫిర్యాదులో పేర్కొనడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆ కోణంలోనే దర్యాప్తు చేపట్టారు. విచారణలో భాగంగా సంచలన విషయాలు బయటపడ్డాయి.

శారదతో గొడవ జరిగిన తర్వాత రమేష్‌ను చంపేయాలని భార్య తరపు బంధువులు నిర్ణయించుకున్నారని, ఈ నేపథ్యంలోనే ఈ నెల 2వ తేదీన విషప్రయోగం చేసి స్పృహ కోల్పోయిన తర్వాత విచక్షణా రహితంగా కొట్టి చంపేశారని పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. రమేశ్ శవాన్ని గ్రామ శివారులోని ఓ నిర్మానుష్య ప్రాంతంలో గోతిలో పాతిపెట్టనట్లు తేల్చారు.

ఇవి కూడా చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.