మాటలు రాని మూగ యువతిపై ముగ్గురు మైనర్లు దారుణానికి ఒడిగట్టారు. అమ్మాయిపై అత్యాచారం చేసి ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ దారుణ ఘటన వరంగల్ జిల్లాలో జరిగింది. కళ్లు సరిగా కనిపించని, మాటలు రాని యువతిపై ముగ్గురు బాలురు ఇంట్లోకి చొరబడి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. వరంగల్కు చెందిన ఓ మూగ యువతి (23) తల్లి గతంలోనే చనిపోయింది. అయితే తండ్రి పనిమీద బయటకెళ్లడంతో సమీపంలో ఉండే తన అమ్మమ్మ ఇంటికి ఆమెకు తోడుగా ఉండేందుకు వెళ్లింది. ఆ యువతిపై కన్నేసిన ముగ్గురు బాలురు ఇంట్లోకి వచ్చి యువతి అమ్మమ్మకు మాయమాటలు చెప్పారు. అనంతరం యువతిపై దారుణానికి ఒడిగట్టారు. అక్కడే ఉన్న అమ్మమ్మకు చూపు సరిగా లేకపోవడంతో ఆమెకు అనుమానం రాకుండా మాటల్లోకి దింపారు.
ఒకరి తర్వాత ఒకరు మనవరాలిపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు.ఈ తతంగమంతాసెల్ఫోన్లో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అయితే తండ్రి ఇంటికి రాగానే ఆ యువతి తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పింది. వెంటనే ఆయన మిల్స్కాలనీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. నిందితులైన 15, 16 ఏళ్లు లోపు మైనర్లను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
ఒకరి తర్వాత ఒకరు మనవరాలిపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు.ఈ తతంగమంతాసెల్ఫోన్లో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అయితే తండ్రి ఇంటికి రాగానే ఆ యువతి తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పింది. వెంటనే ఆయన మిల్స్కాలనీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. నిందితులైన 15, 16 ఏళ్లు లోపు మైనర్లను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.