యాప్నగరం

వరంగల్‌లో మరో దారుణం.. రైతుని చెట్టుకు కట్టేసి.. ఘోరంగా.!

వరంగల్ జిల్లాలో మరో దారుణ ఘటన జరిగింది. గుర్తు తెలియని దుండగులు రైతుని అతి దారుణంగా హతమార్చారు. చెట్టుకి కట్టేసి అమానుషంగా అంతం చేశారు. నిందితుల వివరాలు తెలియాల్సి ఉంది.

Samayam Telugu 3 Sep 2021, 2:15 pm
చట్టంపై భయం లేకపోవడమో.. బెయిల్‌పై బయటికి రావొచ్చన్న ధీమానో తెలియడం లేదు కానీ సమాజంలో అత్యంత దారుణాలు వెలుగుచూస్తున్నాయి. రోజురోజుకీ నేరాల తీవ్రత పెరిగిపోతోంది. మనిషి ప్రవర్తన క్రూరంగా మారిపోతోంది. హత్యలు చేసేందుకు కూడా చాలా మంది వెనకాడడం లేదు. వరంగల్‌ నగరంలో సొంత అన్నవదిన సహా బావమరిదిని దారుణంగా హతమార్చిన ఘటన మరువక ముందే మరో అమానుష ఘటన జరిగింది. ఓ రైతుని చెట్టుకు కట్టేసి చంపేసిన దారుణ ఘటన వెలుగుచూసింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
murder


సంగెం మండలంలోని తీగరాజుపల్లిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సంపత్(50) అనే రైతుని దుండగులు అతి కిరాతకంగా హతమార్చారు. రైతుని చెట్టుకి కట్టేసి ఫదునైన ఆయుధంతో గొంతులో పొడిచి అమానుషంగా అంతమొందించారు. రైతు హత్యతో గ్రామంలో తీవ్ర కలకలం రేపింది. సంపత్ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. గుర్తుతెలియని దుండగులు హత్య చేసి పరారైనట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.