పున్నామ నరకం నుంచి కాపాడతాడనుకున్న కొడుకు బతికుండగానే నరకం చూపిస్తుండడంతో భరించలేక నరికేశాడో తండ్రి. తన మాతృమూర్తితోనే అసభ్యకరంగా ప్రవర్తించడం చూసి కుమిలిపోయాడు. రోజూ తాగొచ్చి రాక్షసుడిలా హింసిస్తుండడంతో తట్టుకోలేక దారుణానికి పాల్పడ్డాడు. కన్నకొడుకును గొడ్డలితో నరికి చంపేశాడు. ఈ విషాద ఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. కురవి మండలంలోని నల్లెల్ల పంచాయతీ పరిధిలోని ఓ తండాకి చెందిన శ్రీను(పేరుమార్చాం)(36) భార్యాపిల్లలతో వేరే ఊరిలో నివాసముండేవాడు. ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుండడంతో భార్య అతన్ని వదిలేసి వెళ్లిపోయింది. అప్పటి నుంచి తండాకి వచ్చి ఉంటున్న శ్రీను మద్యానికి బానిసయ్యాడు. రోజూ తాగొచ్చి తల్లిదండ్రులతో గొడవపడేవాడు. కొద్దిరోజులుగా అత్యంత నీచంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. తల్లితోనే అసభ్యకరంగా ప్రవర్తిస్తూ లైంగిక వేధింపులకు దిగాడు. అవన్నీ చూస్తూ భరించలేక తండ్రి ఆగ్రహానికి గురయ్యాడు. ఈ కొడుకు ఇక వద్దనుకుని దారుణానికి తెగబడ్డాడు. గొడ్డలితో నరికి చంపేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read:
Also Read: