యాప్నగరం

గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌లో గలీజు పని.. చైన్ లాగేసి.. జంప్

గంజాయి బ్యాచ్ ట్రైన్‌లో హల్‌‌చల్ చేసింది. మత్తులో జోగుతూ జనాన్ని భయాందోళనకు గురిచేశారు. ఇద్దరు యువకులు గొడవపడి బ్లేడుతో దాడులు చేసుకుని కోసేసుకున్నారు. ఈ ఘటన గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌లో కలకలం రేపింది.

Samayam Telugu 26 Nov 2021, 3:18 pm
గుంటూరు నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌లో ఇద్దరు యువకులు గలీజు పనికి పాల్పడ్డారు. ట్రైన్‌లోనే గంజాయి తాగి మత్తులో వీరంగం సృష్టించారు. ఇద్దరి మధ్య ఘర్షణ జరగడంతో ఒకరిపై మరొకరు బ్లేడుతో దాడి చేసుకున్నారు. కాళ్లు, చేతులపై గాయాలై రక్తం కారుతుండడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. వరంగల్ జిల్లా నెక్కొండ వద్ద ఈ ఘటన జరిగింది. అనంతరం ట్రైన్ చైన్ లాగి ఇద్దరూ అక్కడే దిగి పారిపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. దీంతో ట్రైన్ నెక్కొండలోనే అరగంటపాటు నిలిచిపోయింది. ఇద్దరు యువకులు ట్రైన్‌లో భిక్షాటన చేసేవారిగా పోలీసులు గుర్తించారు. గంజాయి మత్తులో గందరగోళం సృష్టించినట్లు భావిస్తున్నారు. రైల్వే పోలీసులు ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు. అనంతరం ట్రైన్ బయలుదేరి సికింద్రాబాద్ వెళ్లిపోయింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
golconda


Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.