యాప్నగరం

దారుణం: ఆడపిల్లలను కడుపులోనే చిధిమేస్తున్నారు

Hanumakonda: కాలం మారుతున్నా కొందరి తీరులో మాత్రం మార్పు రావటం లేదు. ఆడపిల్ల అని తెలిస్తే చాలు కడుపులోనే చిధిమేస్తున్నారు. తాజాగా.. హనుమకొండ జిల్లాలో లింగనిర్ధరణ పరీక్షలు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. మెుత్తం 18 మందిని అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపారు. వీరు ఇప్పటి వరకు 100కు పైగా అబార్షన్లు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

Authored byసందీప్ పూల | Samayam Telugu 29 May 2023, 4:56 pm

ప్రధానాంశాలు:

  • హనుమకొండలో దారుణం
  • గుట్టుచప్పుడు కాకుండా లింగనిర్ధరణ పరీక్షలు
  • 18 మందిని అరెస్టు చేసిన పోలీసులు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Gender determination test
లింగనిర్ధరణ పరీక్షలు
Gender Determination Test: హనుమకొండ జిల్లాలో లింగనిర్ధరణ ద్వారా అబార్షాన్లు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. మెుత్తం 18 మందిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టైన వారిలో ప్రభుత్వ, ప్రయివేటు డాక్టర్లు ఉన్నారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉండగా.. వారి కోసం గాలిస్తున్నట్లు నగర సీపీ ఏవీ రంగనాథ్ వెల్లడించారు.
సీపీ తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్, హనుమకొండలోని పలు ప్రైవేటు ఆసుపత్రుల్లో కొన్ని రోజులుగా లింగనిర్ధరణ పరీక్షలు జరుగుతుననట్లు పోలీసులకు సమాచారం అందింది. స్కానింగ్‌ సెంటర్‌ నిర్వహిస్తూ.. లింగ నిర్ధారణ పరీక్షలు చేయడంతో పాటు అవసరమైన వారికి అబార్షన్లు చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదులపై దృష్టి పెట్టిన నగర పోలీసులు.. స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులను రంగంలోకి దింపారు. జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులతో కలిసి ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో లింగనిర్ధారణ, అబార్షన్‌లు చేసే ఇద్దరు వ్యక్తులను ముందుగా అదుపులోకి తీసుకున్నారు.

ప్రధాన నిందితుడైన వేముల ప్రవీణ్‌ పాత నేరస్తుడిగా పోలీసులు గుర్తించారు. గతంలో స్కానింగ్ కేంద్రంలో టెక్నీషియన్ గా పనిచేసి నిబంధనలకు విరుద్ధంగా లింగనిర్థారణ పరీక్షలు చేసి అతడు అరెస్టయ్యాడు. ఆ తర్వాత తీరు మార్చుకొని ప్రవీణ్.. ఆర్‌ఎంపీలు, పీఆర్‌ఓలు, హాస్పిటల్ మేనెజ్‌మెంట్‌, డాక్టర్లతో కలిసి ముఠాగా ఏర్పడి అక్రమ దందాకు తెరలేపాడు. ప్రవీణ్ తన భార్య సంధ్యారాణితో కలిసి గోపాల్ పూర్ వెంకటేశ్వర కాలనీలో స్కానింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. అక్కడే లింగనిర్ధరణ పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి అబార్షన్లు చేసేవారు. ఇలా ఇప్పటి వరకు వందకు పైగా అబార్షన్‌లు నిర్వహించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

లింగనిర్ధర టెస్ట్ అయితే రూ. 10 వేలు, అబార్షన్ అయితే.. రూ. 30 వేల చొప్పున వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు. మెుత్తం 18 మంది ముఠా సభ్యుల్లో కొందరు ప్రభుత్వ, ప్రైవేట్ డాక్టర్లు ఉన్నారని సీపీ వెల్లడించారు. మరికొందరు పరారీలో ఉండగా.. వారి కోసం గాలిస్తున్నామని చెప్పారు. నిందితుల వద్ద నుంచి లింగనిర్ధారణకు వినియోగించే మూడు స్కానర్లు, రూ. 73 వేల నగదు, 18 సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నట్లు సీపీ రంగనాథ్ వెల్లడించారు.

  • Read More Telangana News And Telugu News
రచయిత గురించి
సందీప్ పూల
సందీప్ పూల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.