యాప్నగరం

ఆన్‌లైన్ పాఠాలు.. ఫోన్ కొనివ్వని పేరెంట్స్, బాలిక ఆత్మహత్య

Online Classes: ఆన్‌లైన్ క్లాసులు వినడానికి తల్లిదండ్రులు ఫోన్ కొనివ్వలేదని మనస్తాపానికి గురై తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది. జనగామ జిల్లా పాలకుర్తిలో ఈ విషాదం జరిగింది.

Samayam Telugu 18 Jan 2021, 6:23 pm
రోనా వైరస్ ప్రత్యక్షంగానే కాకుండా పరోక్షంగానూ తన విషాద ఉదంతాలను కొనసాగిస్తోంది. ఆన్‌లైన్‌ పాఠాలు వినడానికి సెల్‌ఫోన్‌ కావాలని అడగగా, తల్లిదండ్రులు కొనివ్వకపోవడంతో ఓ బాలిక మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుంది. జనగామ జిల్లా పాలకుర్తి మండలం వావిలాల గ్రామంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ఎస్‌ఐ గండ్రాతి సతీశ్ తెలిపిన వివరాల ప్రకారం..
Samayam Telugu ఆన్‌లైన్ తరగతులు
Online Classes


పాలకుర్తి మండలం వావిలాల గ్రామానికి చెందిన శీల వెంకన్న, మంజుల దంపతుల కుమార్తె సింధూజ స్థానికంగా 9వ తరగతి చదువుతోంది. కరోనా సంక్షోభం నేపథ్యంలో పాఠశాలలు మూతబడటంతో కొంత కాలంగా ఆన్‌లైన్‌లో తరగతులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. స్మార్ట్‌ఫోన్‌ లేకపోవడంతో సింధూజ పాఠాలకు దూరమైంది.

పాఠాలు వినలేకపోతున్నానని, సెల్‌ఫోన్‌ కొనివ్వాలని తల్లిదండ్రులను సింధూజ అడుగుతూ వస్తోంది. చదువులో వెనకబడి పోతున్నానని ఆవేదన వ్యక్తం చేసింది. అయితే.. తల్లిదండ్రులు ఆమెకు ఫోన్‌ కొనివ్వడంలో విఫలమయ్యారు. దీంతో మనస్తాపం చెందిన విద్యార్థిని ఆదివారం (జనవరి 17) తన ఇంటి సమీపంలోని బహిరంగ ప్రదేశంలో చెట్టుకు ఉరేసుకుంది. విగతజీవిగా మారిన కుమార్తెను చూసి ఆ తల్లిదండ్రులు బోరుమన్నారు.

Also Read:

పతంగి కోసం పరుగెడుతూ పేడకుప్పలో పడి.. విషాదం!

గూగుల్ మ్యాప్ ఎంత పనిచేసింది.. దారి తప్పి వ్యక్తి మృతి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.