యాప్నగరం

ఇంటి కోసం గుంతలు తవ్వుతుంటే.. బయటపడ్డ బంగారం

కొత్తింటి నిర్మాణ పనుల్ని బిల్డర్‌కు అప్పగించారు. పని చేస్తున్న కూలీలకు బంగారం దొరికింది. దీంతో పంపకంలో తేడాలు వచ్చి విషయం కాస్త బయటకు పొక్కింది. దీంతో పోలీసులు సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.

Samayam Telugu 4 Mar 2021, 12:19 pm
ఇంటి కోసం గుంతలు తవ్వేటప్పుడు అందులో రకరకాల వస్తువులు బయటపడుతుంటాయి. కొన్ని సందర్భాల్లో పాతకాలం నాటి నాణాలు, వస్తువులు దర్శనమిస్తుంటాయి. అయితే ఓ వ్యక్తి ఇంటి నిర్మాణం కోసం తవ్వకాలు చేపట్టాడు. అయితే ఆయనకు బంగారం దొరికింది. ఈ ఘటన వరంగల్ జిల్లా కరీమాబాద్‌లో చోటు చేసుకుంది. బొమ్మలగుడి ప్రాంతంలో గొలికారి రమేష్ అనే వ్యక్తికి ఓ పాత ఇంటి స్థలం ఉంది. అయితే అక్కడ కొత్త ఇల్లు నిర్మించాలనుకున్నాడు. అయితే ఆపనులు కాస్త ఓ బిల్డర్‌కు అప్పగించాడు.
Samayam Telugu బంగారం (ఫైల్ ఫోటో)


అయితే పనులు ప్రారంభం అయ్యాయి. కాట్రవల్లీకి చెందిన కూలీలు వచ్చి కొత్తింటి నిర్మాణం కోసం గుంలు తీయడం ప్రారంభించారు. అయితే అక్క చేపట్టిన తవ్వకాల్లో మూడున్నర తులాల బంగారు గొలుసుకు బయటపడింది. అయితే దీని పంపకం విషయమై కూలీల మధ్య గొడవ రాజుకుంది. దీంతో ఈ విషయం ఆనోట.. ఈనోట నాని... బయటపడింది.

దీంతో ఎస్‌ఐ సతీష్‌ చేరుకుని కూలీలు విచారించి గొలుసు స్వాధీనం చేసుకున్నారు. అయితే, పాత ఇళ్లు 30 నుంచి 40 ఏళ్ల క్రితం నిర్మించిన నేపథ్యంలో తమ పూర్వీకులు ఇంకా ఏమైన ఆభరణాలు దాచిపెట్టారా అనే అనుమానాల్ని యజమాని వ్యక్తం చేశారు. దగ్గరుండి ఇంటి నిర్మాణానికి సంబంధించిన తవ్వకాలు చేయాలని భావిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.