యాప్నగరం

బెదిరిన ఎద్దులు.. చెరువులో మునిగి తాత, మనవడి మృతి, వరంగల్ జిల్లాలో విషాదం..

చెరువుకట్టపై వెళ్తుండగా ఎద్దులు బెదరడంతో బండి చెరువులో పడిపోయింది. దీంతో నీటిలో కొట్టుమిట్టాడుతున్న మనవడిని కాపాడేందుకు చెరువులో దిగిన తాత కూడా మునిగిపోయాడు.

Samayam Telugu 1 Feb 2021, 9:49 am
ఎడ్లబండి అదుపుతప్పి చెరువులో పడిపోయిన ఘటనలో తాత, మనవడు నీటిలో మునిగి మృతి చెందారు. ఈ విషాద ఘటన వరంగల్‌ రూరల్‌ జిల్లా నడికూడ మండలం వరికోల్ గ్రామంలో ఆదివారం జరిగింది. వరికోల్‌కు చెందిన కానాల సాంబయ్య (46) తన పెద్ద కూతురు కుమారుడు ఆసోల ఆర్తిక్‌ (6) ఆదివారం సాయంత్రం వేళ వ్యవసాయ పనులు ముగించుకుని ఇంటికి బయల్దేరారు. ఆర్తిక్ ఎడ్లబండి తోలుతుండగా సాంబయ్య వెనకాలే నడుచుకుంటూ వస్తున్నాడు.
Samayam Telugu మృతదేహాలను బయటకు తీస్తున్న గ్రామస్థులు


Also Read: జీహెచ్ఎంసీ అధికారులకు షాక్.. కోర్టు ఆదేశాలతో కేసు నమోదు, తెలంగాణలో తొలిసారిగా

వరికోల్-వేములపల్లి గ్రామాల మధ్య ఉన్న నల్లకుంట చెరువు కట్టపై ఎద్దులు బెదరడంతో బండి అదుపుతప్పి చెరువులో పడిపోయింది. ఆర్తిక్‌ నీటిలో పడిపోగగా వెనకాల వస్తున్న సాంబయ్య మనవడిని కాపాడటానికి చెరువులోకి దిగాడు. ఆయనకు ఈత రాకపోవడంతో ఇద్దరూ నీటిలో మునిగిపోయారు. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాలను బయటకు తీశారు. తాత, మనవడు ఒకేసారి ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబం విషాదంల మునిగిపోయింంది. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి బాధిత కుటుంబ సభ్యులకు రూ.50 వేల ఆర్థిక సాయం ప్రకటించారు.

Also Read: తల్లిదండ్రుల కలహాలు.. మనస్తాపంతో యువతి షాకింగ్ నిర్ణయం, తల్లికి వీడియో కాల్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.