వరంగల్ మేయర్గా గుండు సుధారాణి.. ప్రమాణం చేయించిన మంత్రులు
GWMC: మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర సీనియర్ నేతలతో చర్చించి అధిష్ఠానం వీరి పేర్లను ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. పార్టీ పట్ల విధేయత, అనుభవం, సామాజిక సమీకరణలను పరిగణనలోకి తీసుకున్నట్లు సమాచారం.
Samayam Telugu 7 May 2021, 3:28 pm
ప్రధానాంశాలు:
- వరంగల్ మేయర్గా గుండు సుధారాణి
- డిప్యూటీ మేయర్గా రిజ్వానా షమీమ్
- ప్రమాణం చేయించిన మంత్రులు
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ పేర్లు ఖరారయ్యాయి. మేయర్గా గుండు సుధారాణి, డిప్యూటీ మేయర్గా రిజ్వానా షమీమ్ పేర్లను అధిష్ఠానం ఖరారు చేసింది. గుండు సుధారాణి వరంగల్ 29వ డివిజన్ నుంచి గెలుపొందగా.. రిజ్వానా షమీమ్ 36వ డివిజన్ నుంచి గెలిచారు. వరంగల్ ఎన్నికల పరిశీలకులుగా ఉన్న మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, ఇంద్రకరణ్ రెడ్డి.. సుధారాణి, షమీమ్ పేర్లను ప్రకటించారు. అనంతరం శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు వారు ప్రమాణం చేయించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర సీనియర్ నేతలతో చర్చించి అధిష్ఠానం వీరి పేర్లను ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. పార్టీ పట్ల విధేయత, అనుభవం, సామాజిక సమీకరణలను పరిగణనలోకి తీసుకున్నట్లు సమాచారం. ఇక మేయర్, చైర్పర్సన్ల కోసం పరోక్ష ఎన్నిక నిర్వహించారు. మేయర్ అభ్యర్థుల పేర్లతో కూడిన సీల్డ్ కవర్లను టీఆర్ఎస్ అధిష్ఠానం, పార్టీ పరిశీలకులకు అందించింది. కరోనా పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో 8 మంది కార్పొరేటర్లు గైర్హాజరు అయ్యారు. వీరితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి తద్వారా ఓటింగ్ ప్రక్రియ పూర్తి చేశారు.