యాప్నగరం

తెలంగాణలో దిక్కులేదు.. దేశ్‌కీ నేత అవుతాడట: కేసీఆర్‌పై ఈటల ఫైర్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ఆరిపోయే దీపమని ఎద్దేవా చేశారు.

Authored byవీరేష్ బిళ్ళ | Samayam Telugu 29 Jun 2022, 2:46 pm

ప్రధానాంశాలు:

  • టీఆర్ఎస్ ఆరిపోయే దీపం
  • కేసీఆర్‌ దేశాన్ని ఉద్దరించడానికి బయలుదేరాడు
  • బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఫైర్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu ఈటల రాజేందర్
కేసీఆర్ సారథ్యంలోని టీఆర్ఎస్ పార్టీ ఆరిపోయే దీపమని మాజీ మంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. కేసీఆర్ రాజకీయ జీవితానికి కాలం చెల్లిపోయిందని, తెలంగాణలో బీజేపీదే ఆధిపత్యమని పేర్కొన్నారు. హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండ గ్రామంలో బీజేపీ పార్టీ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
కేసీఆర్ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఈటల రాజేందర్ మండిపడ్డారు. తెలంగాణలోనే ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోని వ్యక్తి.. దేశ రాజకీయాల్లో ఏదో వెలగబెట్టేస్తానంటూ తిరుగుతున్నాడని ఎద్దేవా చేశారు. సంక్షేమ పథకాలు, ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్ కుటుంబం రూ.వందల కోట్ల అవినీతికి పాల్పడిందని ఆరోపించారు.
రచయిత గురించి
వీరేష్ బిళ్ళ
వీరేశ్ బిల్లా సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ రాజకీయ, సినీ రంగాలకు చెందిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. దీంతో పాటు వీడియో టీమ్‌కు సేవలు అందిస్తున్నారు. తనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాజకీయాలు, క్రీడలు, సినిమా రంగాలకు సంబంధించి ఆర్టికల్స్ రాశారు... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.