యాప్నగరం

Kesamudram: గుండెపోటుతో ఎమ్మార్వో ఆకస్మిక మృతి

Kesamudram MRO: ఇటీవల కాలంలో గుండెపోటు మరణాలు ఎక్కువయ్యాయి. వయస్సుతో సంబంధం లేకుండా చాలా మంది గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా.. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం ఎమ్మార్వో గుండెపోటుకు గురై ప్రాణాలకు కోల్పోయారు.

Authored byసందీప్ పూల | Samayam Telugu 20 Apr 2023, 3:03 pm

ప్రధానాంశాలు:

  • మహబూబాబాద్ జిల్లా విషాదం
  • గుండెపోటుతో ఎమ్మార్వో ఆకస్మిక మృతి
  • విచారం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే శంకర్ నాయక్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu heart attack
గుండెపోటుతో ఎమ్మార్వో మృతి

Mahabubabad MRO: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. గుండెపోటు (Heart Attack)తో ఎమ్మార్వో ఆకస్మికంగా మృతి చెందారు. కేసముద్రం ఎమ్మా్ర్వోగా విధులు నిర్వహిస్తున్న ఫరీద్దున్.. రంజాన్ పండుగ పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మండల కేంద్రంలో గత రాత్రి ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ముస్లిం సోదరులతో కలిసి విందులో పాల్గొ్న్న ఎమ్మార్వో ఫరుద్దీన్ ఇంటికి వెళ్లిన కాసేపటికే అస్వస్థకు గురయ్యాడు. అనంతరం వెంటనే ఇంటికి రావాలని కారు డ్రైవర్‌కు ఫోన్ చేశాడు. ఇంటికి చేరుకున్న డ్రైవర్ అతడిని సమీపంలోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే శంకర్ నాయక్.. మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి ఎమ్మార్వో ఫరీదుద్దీన్‌కు మెరుగైన చికిత్సను అందించాలని డాక్టర్లకు సూచించారు. వైద్యులు చికిత్స అందిస్తుండగానే ఆయన ప్రాణాలు కోల్పాయారు. ఎమ్మార్వో మృతిపై శంకర్ నాయకు విచారం వ్యక్తం చేశారు. ఇఫ్తార్ విందులో కాసేపటి క్రితమే ఆయన పాల్గొన్నారని.. అందరికి స్వయంగా వడ్డించారన్నారు. గుండె పోటుతో ఇలా ఆకస్మికంగా మృతి చెందటం బాధాకరమని అన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపిన.. శంకర్ నాయక్ ప్రభుత్వం తరఫున వారి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
మరో ఘటనలో ఓ ఉపాధ్యాయురాలు విద్యార్థులకు పాఠాలు చెబుతూ క్లాస్‌రూంలోనే గుండెపోటుతో కుప్పకూలి చనిపోయారు. సంగారెడ్డి జిల్లా చౌటకూరు ప్రైమరీ స్కూల్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. మెదక్ జిల్లా కొల్చారం మడలం రంగంపేటకు చెందిన పద్మలత (42) సంగారెడ్డి చాణిక్యపురిలో నివాసం ఉంటున్నారు. ఆమె.. చౌటకూరు ప్రైమరీ స్కూల్‌లో ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం విద్యార్థులకు పాఠాలు చెబుతూ ఆమె గుండెపోటుకు గురై ఒక్కసారి కూప్పకూలిపోయారు. గమనించిన తోటి ఉపాధ్యాయులు ఆమెను సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్తుండగగా... మార్గమధ్యలోనే మృతి చెందింది. మృతురాలికి భర్త ఇద్దరు ఆడపిల్లలున్నారు.

ఇటీవల కాలంలో గుండెపోటుతో మరణించే వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతుంది. వయస్సుతో సంబంధం లేకుండా చాలా మంది గుండెపోటుతో ఆకస్మికంగా ప్రాణాలు కోల్పోతున్నారు. నడుస్తూ.. నవ్వుతూ.. ఆడుతూ.. పాడుతూ ఇలా ఉన్నట్లుండి కుప్పకూలిపోతున్నారు. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు గుండెపోట్లకు కారణాలుగా డాక్టర్లు చెబుతున్నారు. సమతుల ఆహారంతో పాటు, కంటి నిండా నిద్ర, శరీరానికి తగిన వ్యాయయం, యోగా చేయటం ద్వారా ఆకస్మిక మరణాల నుంచి తప్పించుకోవచ్చునని వైద్యులు వెల్లడిస్తున్నారు.

  • Read More Telangana News And Telugu News
రచయిత గురించి
సందీప్ పూల
సందీప్ పూల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.