యాప్నగరం

ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ.. పలువురికి గాయాలు

లారీ అతివేగమే ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు. ఈ ఘటనలో బస్సులో ఉన్న పలువురు ప్రయాణికులు గాయాలపాలయ్యారు. దీంతో వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Samayam Telugu 19 Jun 2021, 11:32 am

ప్రధానాంశాలు:

  • ఆర్టీసీ బస్సును ఢీకొన్నలారీ
  • పదిమంది ప్రయాణికులకు గాయాలు
  • లారీ అతివేగమే ప్రమాదానికి కారణం
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
వరంగల్ గ్రామీణ జిల్లా శాయంపేట మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హన్మకొండ నుంచి భూపాలపల్లికి వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఇసుక లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 20 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. 10 మంది స్పల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. లారీ అతివేగమే ప్రమాదానికి కారణంగా పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనలో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. గాయపడ్డ వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. .

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.