యాప్నగరం

ములుగు: ప్రేమకు నో చెప్పిన పెద్దలు.. ఊరి చివర షాకింగ్ నిర్ణయం తీసుకున్న జంట

తెలంగాణలోని ములుగు జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది. తమ ప్రేమకు పెద్దలు నిరాకరించడంతో యువతీ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.

Samayam Telugu 15 Jan 2021, 2:44 pm
సంక్రాంతి పండగ వేళ ములుగు జిల్లాలో విషాదం నెలకొంది. వెంకటాపూర్(రామప్ప) మండలం నల్లగుంట గ్రామ సమీపంలోని దేవాదుల పైప్ లైన్ వద్ద శుక్రవారం ప్రేమికులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. నల్లగుంటకు చెందిన యువకుడు(21), భూపాలపల్లికి చెందిన యువతి(17) కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం అమ్మాయి ఇంట్లో తెలియడంతో పెద్దలు పెళ్లికి నిరాకరించారు.
Samayam Telugu Image


దీంతో పాటు ఇకపై ఆ యువకుడిని కలుసుకోకూడదని ఆమెను బెదిరించారు. ఈ క్రమంలోనే గురువారం నల్లగుంటలోని బంధువుల ఇంటికి వచ్చిన యువతి తన ప్రియుడిని కలుసుకుంది. ప్రేమకు తన తల్లిదండ్రులు విలన్లుగా మారారని చెప్పి బోరుమంది. దీంతో కలిసి బ్రతకలేనప్పుడు కలిసి చనిపోదామని ఇద్దరూ నిర్ణయించుకున్నారు.

ఈ రోజు ఉదయం ఇద్దరూ కలిసి గ్రామ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లి పురుగులమందు తాగేశారు. అటుగా వెళ్తున్న కొందరు గ్రామస్థులు వారిని గమనించి వెంటనే ములుగు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స తర్వాత మల్లంపల్లిలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారిద్దరి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.