యాప్నగరం

జనగామ జిల్లాలో విషాదం.. పల్లె ప్రకృతి వనంలో ప్రేమ జంట ఆత్మహత్య

జనగామ జిల్లా పాలకుర్తిలో విషాదం చోటు చేసుకుంది. బీక్యానాయక్ తండాకు చెందిన ప్రేమ జంట గ్రామ సమీపంలోని పల్లె ప్రకృతి వనంలో ఆత్మహత్యకు పాల్పడింది. వీరిద్దరూ గురువారం రాత్రి సమయంలో పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నారని భావిస్తున్నారు.

Authored byరవి కుమార్ | Samayam Telugu 13 Aug 2022, 10:47 am
జనగామ జిల్లా పాలకుర్తి మండలం బీక్యానాయక్ తండాలో విషాదం చోటు చేసుకుంది. గ్రామ సమీపంలోని పల్లె ప్రకృతి వనంలో దీపిక, రాజు అనే ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మైనర్ అయిన బానోతు దీపికకు.. రాజు బలవంతంగా పురుగుల మందు తాగించి.. ఆ తర్వాత తాను కూడా తాగి ఆత్మహత్య చేసుకొని ఉంటాడని అనుమానిస్తున్నారు.
Samayam Telugu మృతుడు రాజు


గుగులోతు రాజు గత మూడు నెలల క్రితం ప్రియాంక అనే మరో మైనర్ మృతికి కారణం అనే ఆరోపణలు వస్తున్నాయి. రాజు రాత్రి సమయంలో ఎవరూ చూడకుండా.. దీపికను ఊరు బయటకు తీసుకొచ్చి బలవంతంగా పురుగుల మందు తాగించి హత్యకు పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించారు.
రచయిత గురించి
రవి కుమార్
రవి కుమార్ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. స్పోర్ట్స్, ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, ఎడ్యుకేషన్ సంబంధింత అంశాలను అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.