యాప్నగరం

భార్యకు కరెంట్ షాక్.. భర్త, ఎదురింటి దంపతుల మృతి

Warangal: ఓ మహిళ బట్టలు ఉతికి తీగపై ఆరేస్తుండగా కరెంట్ షాక్‌కు గురైంది. కాపాడటానికి వచ్చి భర్త, వారి అరుపులు విని పరుగెత్తుకొచ్చి ఎదురింటి దంపతులు మొత్తం నలుగురు మరణించారు. మహబూబాబాద్ జిల్లా ఆమన్‌గల్‌లో ఈ ఘటన జరిగింది.

Samayam Telugu 9 Jan 2021, 10:24 pm
హబాబూబాద్‌ జిల్లాలోని ఆమనగల్ గ్రామంలో ఘోర విషాదం చోటు చేసుకుంది. కరెంట్ షాక్ పక్కనే పక్కనే నివాసం ఉంటున్న రెండు జంటలను బలిగొంది. గ్రామానికి చెందిన చెన్నబోయిన రాధమ్మ (49) బట్టలు ఉతికి దండెం తీగపై ఆరేయబోయింది. అయితే.. ఆ తీగ (జీ వైర్‌)కు విద్యుత్‌ సరఫరా కావడంతో ఆమె విద్యుదాఘాతానికి గురైంది. రాధమ్మ అరుపులు విని ఆమెను రక్షించేందుకు భర్త సత్తయ్య (59) ప్రయత్నించాడు. తీగను పట్టుకొని లాగడంతో ఆయన కూడా కరెంట్ షాక్‌కు గురయ్యాడు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
Current shock


రాధమ్మ, దంపతుల కేకలు విని ఎదురింట్లో ఉండే దాసరి లింగయ్య (46), లక్ష్మి (42) దంపతులు అక్కడికి పరుగెత్తుకొచ్చారు. వారిని రక్షించే క్రమంలో ఒకరి తర్వాత ఒకరు వారిద్దరూ కూడా విద్యుదాఘాతానికి గురై మరణించారు. ఒకేసారి నలుగురు ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి వచ్చి పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read:

కొవాగ్జిన్‌ తీసుకున్న వలంటీర్‌ మృతి..

శ్మశానంలో విషాద ఘటన.. 25 మంది మృతి

అక్రమ సంబంధం.. తండ్రి ఒంటికి నిప్పు పెట్టిన కూతురు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.