యాప్నగరం

అత్తింటి వేధింపులకు అల్లుడు బలి.. బిడ్డ పుట్టిన 20 రోజులకే

భార్య, అత్తింటి వారి వేధింపులు తట్టుకోలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మహబూబాబాద్ జిల్లాలోని గార్ల పట్టణంలో బుధవారం వెలుగుచూసింది.

Samayam Telugu 24 Jun 2021, 10:36 am
అత్తామామల వేధింపులు తట్టుకోలేక మనస్తాపానికి గురైన యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలంగాణలోని మహబూబాబాద్‌ జిల్లాలో విషాదం నింపింది. గార్లలోని వెంకటేశ్వరస్వామి దేవాలయం బజార్‌కు చెందిన బరిబద్దల రాకేష్‌(26)కు నెక్కొండ మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన స్నేహతో ఏడాది క్రితం వివాహం జరిగింది. 20 రోజుల క్రితమే వీరికి బాబు పుట్టాడు.
Samayam Telugu రాకేష్‌(ఫైల్‌ ఫోటో)


అయితే రాకేష్ ఏ పనీ చేయకుండా జులాయిగా తిరుగుతుండేవాడు. దీంతో అత్తామామలు మునీందర్, రేణుకతో పాటు ఇతర బంధువులు రాకేష్‌ను తరుచూ నిందించేవారు. ఏ పనీ చేయకుండా పెళ్లాన్ని, కొడుకుని ఎలా పోషిస్తావంటూ తరుచూ ఫోన్లు చేస్తూ మానసికంగా వేధించేవారు. దీంతో మనస్తాపానికి గురైన రాకేష్ బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి రాజేశం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.