యాప్నగరం

వరంగల్ రైల్వే క్వార్టర్స్‌లో దారుణం.. భార్యను చంపేసి..

రైల్వే క్వార్టర్స్ నివాసముంటున్న రమ దారుణ హత్యకు గురైంది. విగతజీవిగా పడి ఉండడం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కట్టుకున్న భర్తే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

Samayam Telugu 24 Mar 2021, 9:13 pm
వరంగల్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కట్టుకున్న భార్యను కిరాతకంగా హతమార్చాడో కసాయి భర్త. ఈ అమానుష ఘటన కాజీపేట రైల్వే క్వార్టర్స్‌లో జరిగింది. రైల్వే క్వార్టర్స్‌కి చెందిన మేకల శ్రీనివాస్, రమ దంపతులు. వారికి ఇద్దరు కుమారులు సంతానం. అనూహ్యంగా భార్య రమ భర్త చేతిలో దారుణ హత్యకు గురైంది. అతికిరాతకంగా ఆమె గొంతుకోసి చంపేశాడు దుర్మార్గుడు. హత్యానంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. స్థానికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. హత్యకు గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Samayam Telugu ఇన్‌సెట్‌లో మృతురాలు రమ(ఫైల్ ఫొటో)
wife murder


Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.