యాప్నగరం

Mulugu: కలకలం రేపుతున్న మావోల లేఖ.. బీఆర్ఎస్ నేతల్లో టెన్షన్!

Maoist Letter: పలువురు అధికార పార్టీ నేతలకు హెచ్చరికలు జారీ చేస్తూ.. ములుగు జిల్లా ఏటూరు నాగారంలో మావోయిస్టుల పేరిట విడుదలైన లేఖ ఆ ప్రాంతంలో కలకలం రేపుతోంది. అధికార పార్టీని అడ్డం పెట్టుకొని భూ కబ్జాలు, ఇసుక దోపిడీకి పాల్పడుతున్న నాయకులకు ప్రజా కోర్టులో శిక్ష తప్పదని మావోయిస్టులు రాసినట్లుగా చెబుతున్న లేఖలో హెచ్చరించారు.

Authored byసందీప్ పూల | Samayam Telugu 3 Apr 2023, 1:16 pm

ప్రధానాంశాలు:

  • ములుగు జిల్లాలో మావోయిస్టుల పేరుతో లేఖ
  • పద్ధతి మార్చుకోవాలని బీఆర్ఎస్ నేతలకు హితవు
  • లేదంటే ప్రజాకోర్టులో శిక్షతప్పదని హెచ్చరిక
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Maoist Letter
మావోయిస్టుల లేఖ కలకలం
Eturnagaram: ములుగు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతమైన ఏటూరు నాగారంలో మావోయిస్టుల పేరిట విడుదలైన లేఖ కలకలం రేపుతోంది. మావోయిస్టు యాక్షన్ టీం బద్రు, కామ్రేడ్ వెంకటేష్ పేరుతో హెచ్చరిక లేఖను విడుదల చేశారు. వాల్ పోస్టర్లలో పలువురు బీఆర్ఎస్ నేతల పేర్లు వెల్లడిస్తూ హెచ్చరికలు జారీ చేశారు. ఏటూరు నాగారం బీఆర్ఎస్ టౌన్ అధ్యక్షుడిగా కొనసాగుతున్న మహమ్మద్ ఖాజా పాషా, పార్టీకి చెందిన కునూరు మహేశ్, చిప్ప అశోక్ పేర్లను లేఖలో పేర్కొన్నారు. ఇసుక దోపిడీ, భూ కబ్జాలకు పాల్పడుతున్నారని.., ప్రజా వ్యతిరేక పద్ధతులు మార్చుకోవాలన్నారు. లేదంటే ప్రజల సమక్షంలో ప్రజా కోర్టులో శిక్ష తప్పదని హెచ్చరించారు.
ఫారెస్ట్ అధికారులు, పోలీసులను కూడా లేఖలో హెచ్చరించారు. ఫారెస్ట్ అధికారులు ప్రజలపై కేసులు పెట్టి వారిని ఇబ్బందులు పెడుతున్నారన్నారు. పోలీసుల కన్నా.. ఫారెస్ట్ అధికారులు ఎక్కువ చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా అధికారులు పద్ధతి మార్చుకుంటే మంచిదని లేఖలో హెచ్చరించారు. పోలీస్ ఇన్ఫార్మర్లు కూడా పద్ధతి మార్చుకోవాలన్నారు. అటవీ ప్రాంతంలో పోలీసుల కూలింగ్ ఆపకపోతే బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడి నుండి జిల్లా స్థాయి నాయకుల వరకు ఎవర్ని వదలబోమని హెచ్చరించారు. మావోయిస్టుల లేఖతో ఏటూరు నాగారం ప్రాతంతంలోని బీఆర్ఎస్ పార్టీ నాయకులలో అలజడి మొదలైంది. ఎప్పుడు ఏం జరనుందోనని నేతలు టెన్షన్ పడుతున్నారు. మరోవైపు లేఖను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

బెల్లింపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు కూడా మావోయిస్టుులు బెదిరింపు లేఖ రాశారు. సింగరేణి కోల్ బెల్ట్ ఏరియా కమిటీ పేరుతో చిన్నయ్యకు వార్నింగ్ లేఖ రాశారు. సమస్యలతో వచ్చే మహిళలను ఎమ్మెల్యే ప్రలోభపెట్టి లొంగదీసుకుంటున్నాడని మావోయిస్టుల రాసినట్లుగా చెబుతున్న లేఖలో పేర్కొన్నారు. అలా చేయటం ఎమ్మెల్యేకు అలవాటుగా మారిందని అన్నారు. ఎన్నిసార్లు హెచ్చరించినా.. పద్దతి మార్చుకోవటం లేదని మావోయిస్టు కోల్ బెల్ట్ ఏరియా కార్యదర్శి ప్రభాత్ పేరిట వార్నింగ్ లేఖ రాశారు. పద్దతి మార్చుకోకపోతే.. ప్రజా కోర్టులోశిక్ష తప్పదని ప్రభాత్ పేరిట విడుదలైన లేఖలో హెచ్చరించారు. ఇలా వరుసగా మావోయిస్టుల పేరిట లేఖలు విడుదల కావటం కలకలం రేపుతోంది.

  • Read More Telangana News And Telugu News
రచయిత గురించి
సందీప్ పూల
సందీప్ పూల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.