యాప్నగరం

Breaking: మేడారంలో కరోనా కలకలం

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. మినీ మేడారం జాతరలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. అధికారులు, భక్తులు ఆందోళన చెందుతున్నారు.

Samayam Telugu 27 Feb 2021, 2:41 pm
మేడారంలో కరోనా కలకలం రేగింది. మేడారం మినీ జాతరలో పాల్గొన్న దేవాదాయ శాఖ సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడం ఆందోళన కలిగిస్తోంది. జాతరలో విధులు నిర్వహిస్తున్న ముగ్గురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ములుగు జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి అప్పయ్య ఉద్యోగులకు కరోనా సోకినట్లు నిర్ధారించారు. దీంతో అధికారులు, జాతరకు విచ్చేసిన భక్తులు ఆందోళనలో ఉన్నారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
corona


ఇటీవల కరీంనగర్, వరంగల్ జిల్లాలోనూ కరోనా కేసులు వెలుగుచూశాయి. వరంగల్‌లో పాఠశాల విద్యార్థులకు కరోనా వైరస్ సోకడంతో క్వారంటైన్‌కి తరలించారు. సిద్దిపేట జిల్లా కొండపాక పాఠశాల టీచర్‌కి కరోనా రావడంతో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. తాజాగా మేడారంలో కరోనా కేసులు వెలుగుచూడడం కలకలం రేపుతోంది.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.