యాప్నగరం

ఆ మాటలు మేమనలేమా.. అన్నీ అంటూనే నిప్పులు చెరిగిన కేటీఆర్

తెలంగాణ మంత్రి కేటీఆర్ వరంగల్ పర్యటనలో విపక్ష నేతలపై నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డి, బండి సంజయ్‌ని టార్గెట్‌ చేశారు. చిల్లరనాయాళ్లు చిల్లర మాటలు మాట్లాడుతున్నారంటూ సీరియస్ కామెంట్స్ చేశారు.

Samayam Telugu 20 Apr 2022, 7:36 pm
టీపీసీసీ చీఫ్, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌పై తెలంగాణ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. చిల్లర వ్యక్తులు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. పద్నాలుగేళ్లు పోరాడి.. ప్రాణాలు అడ్డుపెట్టి తెలంగాణ తెచ్చిన మహానుభావుడు.. ప్రజల మన్ననలు పొంది రెండుసార్లు ముఖ్యమంత్రి అయిన కేసీఆర్‌‌పై సోయి లేకుండా మాట్లాడుతున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Samayam Telugu ktr


కేసీఆర్ తెలంగాణ జెండా ఎత్తకపోతే ఈ చిల్లర గాళ్లకు పదవులు ఎక్కడివని మంత్రి ప్రశ్నించారు. టీపీసీసీ, టీబీజేపీ కేసీఆర్ వల్లేనని ఆయన అన్నారు. నాది తెలంగాణ రాష్ట్రం అని గల్లా ఎగరేసి చెప్పుకునేలా చేసిన నాయకుడు కేసీఆర్ అని.. ఆయన లేకపోతే ఇవ్వాళ మొరుగుతున్న కుక్కలకు.. గాడిదలకు టీపీసీసీ, టీబీజేపీ ఎక్కడిదని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎవడీ రేవంత్ రెడ్డి.. ఎవడా బండి సంజయ్.. ఎవరైనా అంతకుముందు గుర్తుపడతారా అని ఆయన అన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీని.. అమిత్‌ షాని బట్టేబాజ్.. లుచ్చాగాడు అని అనడం మాకు రాదా? అని కేటీఆర్ ప్రశ్నించారు. అయినా తాము అనమని.. అది తమ నాయకుడు నేర్పిన సంస్కారమని మంత్రి అన్నారు. నాలుక మాట్లాడడం మొదలుపెడితే మా కంటే బాగా ఎవడూ మాట్లాడలేడని హెచ్చరించారు. చిల్లర వ్యక్తులు ఏది పడితే అది మాట్లాడుతున్నారని విమర్శించారు. తంబాకు తినే బండి సంజయ్‌ని కరీంనగర్‌లో గెలిపిస్తే అతను పాలమూరులో తిరుగుతున్నాడని విమర్శించారు. అమ్మకి అన్నం పెట్టనోడు.. చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడట అంటూ సెటైర్లు వేశారు.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.