యాప్నగరం

మహిళా మంత్రితో కలసి ఎంపీ, ఎమ్మెల్యే ఆటాపాట.. అదుర్స్!!

శ్రావణ మాసంలో గిరిజనులు జరుపుకునే తీజ్ పండుగకు మహిళా ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. మహిళలతో కలసి ఎంచక్కా ఆడిపాడారు. మంత్రితో కలసి ఎంపీ, ఎమ్మెల్యే సంప్రదాయ నృత్యంతో అలరించారు.

Samayam Telugu 15 Aug 2021, 7:50 pm
ఎప్పుడూ అధికారిక కార్యక్రమాలతో బిజీగా ఉండే మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు తమ సంప్రదాయ పండుగ రోజు సంతోషంగా ఆడిపాడారు. మహిళా మంత్రితో కలసి ఎంపీ, ఎమ్మెల్యే కాలుకదిపాడు. సంప్రదాయ నృత్యంతో అదరగొట్టారు. మహిళా నేతల ఆటాపాటతో సందడి నెలకొది. అందుకు తీజ్ ఉత్సవాలు వేదికయ్యాయి. శ్రావణ మాసంలో గిరిజనులు జరుపుకునే తీజ్ పండుగ సందర్భంగా రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, ఇల్లెందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ ఉత్సవాల్లో పాల్గొన్నారు.
Samayam Telugu సంప్రదాయ నృత్యం చేస్తున్న మహిళా నేతలు
dance


మహబూబాబాద్ జడ్పీ చైర్‌పర్సన్ బిందు స్వగ్రామం బయ్యారం మండలం బాల్య తండాలో తీజ్ వేడుకలకు మంత్రితో సహా ఎంపీ, ఎమ్మెల్యే హాజరయ్యారు. స్థానికులతో కలసి ఆడిపాడారు. సంప్రదాయ నృత్యంతో మహిళా మణులు అలరించారు. శ్రావణ మాసంలో గిరిజన మహిళలు అంతా కలిసి ఘనంగా నిర్వహించుకునే తీజ్ పండుగ గిరిజన సాంస్కృతిక వైభవానికి నిదర్శనమని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ప్రకృతి తమను చల్లగా చూడాలని కోరుకునేదే తీజ్ పండుగ అన్నారు.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.