యాప్నగరం

పాపను నీటి సంపులో వేసి చంపేసిన తల్లి.. భర్త పడే బాధ చూడలేక!

Woman Kills her Baby in Jangaon: జనగామ పట్టణంలో చైన్ స్నాచింగ్ ఘటన కీలక మలుపు తిరిగింది. ఆ పసిబిడ్డను కన్నతల్లే నీటి సంపులో వేసి చంపేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఆ తర్వాత చైన్ స్నాచర్ల నుంచి తప్పించుకునే క్రమంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులతో చెప్పినట్లు విచారణలో ఆమె అంగీకరించింది. ఈ దారుణం వెనుక హృదయ విదారకమైన కారణం ఉంది. మహిళపై పోలీసులు హత్య కేసు నమోదు చేశారు.

Authored byశ్రీనివాస్ గంగం | Samayam Telugu 2 Aug 2022, 1:11 pm

ప్రధానాంశాలు:

  • జనగామలో చైన్ స్నాచింగ్ ఘటనలో ఊహించని ట్విస్ట్.
  • పాపను నీటి సంపులో వేసి చంపేసిన కన్నతల్లి.
  • ఆ తర్వాత అందరినీ నమ్మించేందుకు చైన్ స్నాచింగ్ డ్రామా.
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Jangaon Baby Death
ఆస్పత్రిలో రోదిస్తున్న చిన్నారి తల్లి
నగామ జిల్లా కేంద్రంలో (Jangaon) చైన్ స్నాచింగ్ ఘటన ఊహించని మలుపు తిరిగింది. పసిబిడ్డను కన్నతల్లే చంపేసి చైన్ స్నాచింగ్ కథ అల్లినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ ఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. ఏడాది వయసున్న చిన్నారిని ఎత్తుకొని రోదిస్తూ ఆస్పత్రికి పరుగొత్తుకొచ్చింది జనగామ పట్టణంలోని అంబేడ్కర్‌ నగర్‌లో నివాసం ఉంటున్న ప్రసన్న అనే మహిళ. సోమవారం (ఆగస్టు 1) ఉదయం తన ఇంటి ముందు బిడ్డను ఎత్తుకొని ఉండగా.. ముసుగు వేసుకొని వచ్చిన ఓ దొంగ తన మెడలో నుంచి పుస్తెలతాడు దొంగిలించేందుకు ప్రయత్నించాడని, తాను తీవ్రంగా ప్రతిఘటించానని ఆమె చెప్పింది. తప్పించుకునే క్రమంలో ఆ దుండగుడు.. తన చేతిలో ఉన్న చిన్నారి తేజస్వినిని బలవంతంగా లాక్కొని పక్కనే ఉన్న నీటి సంపులో పడేసి అక్కడి నుంచి పారిపోయాడని తెలిపింది.
చిన్నారిని పరిశీలించిన వైద్యులు అప్పటికే ఆ బిడ్డ మృతి చెందినట్లు నిర్ధారించారు. ఆభరణాల కోసం దొంగలు ఇంతకు తెగించారనని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని పరిశీలించారు. మహిళను, స్థానికులను ప్రశ్నించి వివరాలు సేకరించారు. పోలీసుల విచారణలో ఆమె పొంతనలేని సమాధానాలు చెప్పడతంలో మహిళపై అనుమానం వచ్చింది. ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాల్లోనూ ఎక్కడా ముసుగు దొంగకు సంబంధించిన దృశ్యాలు కనిపించకపోవడంతో వారి అనుమానం మరింత బలపడింది. ఆ మహిళను అదుపులోకి తీసుకొని విచారించగా.. దిగ్భ్రాంతికర వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.

ఆ పసిబిడ్డను చేతులారా తానే నీటి సంపులో పడేసి, ఊపిరాడకుండా చేసి చంపేసినట్లు పోలీసుల విచారణలో ఆ తల్లి అంగీకరించింది. పాపకు అనారోగ్య సమస్యలు ఉండటం, ఎదుగుదల సరిగా లేకపోవడంతో చేజేతులా చంపేసినట్లు తెలిపింది. ఏడాది వయసున్న తేజస్వినికి ఇప్పటికీ కదలికలు లేవు, మాటలు రావు. అచేతనంగా ఉంటోంది. కుమారుడు నవనీత్‌కు కూడా అనారోగ్య సమస్యలు ఉన్నాయి. సెలూన్‌లో కూలీ పని చేసే భర్త నడిగోటి భాస్కర్.. కుమారుడి చికిత్స కోసం ఇప్పటికే 8 లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. ఆర్థిక ఇబ్బందులతో భర్త పడే ఇబ్బంది చూడలేక, తేజస్విని బతుకు భారమవుతుందని భావించి.. మానసిక ఒత్తిడికి గురై భార్య ప్రసన్న ఈ దారుణానికి ఒడిగట్టినట్లు భావిస్తున్నారు. ఆ పాపకు జూలై 22న ఫస్ట్ బర్త్‌డే వేడుక నిర్వహించారు. మహిళపై హత్య కేసు నమోదు చేసి, విచారిస్తున్నట్లు జనగామ సీఐ శ్రీనివాస్‌ వెల్లడించారు.

Also Read:

హారన్ కొడితే తప్పుకోలేదని పొడిచి చంపేసింది.. కానీ, అతడు బధిరుడు!

శివసేన ఎంపీ అరెస్ట్.. అరెస్ట్‌కు ముందు అమ్మను ఆలింగనం చేసుకొని భావోద్వేగ
రచయిత గురించి
శ్రీనివాస్ గంగం
శ్రీనివాస్ రెడ్డి గంగం సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ అంశాలపై వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. EJS నుంచి శిక్షణ పొందిన శ్రీనివాస్‌కు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. JNTU నుంచి BTech చేశారు. గతంలో ప్రముఖ పత్రికల్లో వార్తలు, విద్యా సంబంధిత అంశాలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.